Home / nitish kumar
Bihar government announces Rs.10 lakh compensation to Vaibhav Suryavanshi : ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. బిహార్కు చెందిన వైభవ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. సోమవారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చిచ్చరపిడుగు 35 బంతుల్లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ వైభవ్కే దక్కింది. దేశవ్యాప్తంగా వైభవ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. […]
Nitish Kumar’s JDU withdraws support for BJP-ruled Manipur: మణిపూర్లో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం బుధవారమంతా వార్తల్లో నిలిచింది. మణిపుర్లోని బీజేపీ సర్కార్కు షాక్ ఇస్తూ ఆ ప్రభుత్వానికి నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకున్నారనే వార్తలు రోజంతా చర్చలకు దారితీశాయి. దీంతో కేంద్రంలోనూ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారని మీడియా వాళ్లు చర్చలతో ఊదరగొట్టారు. అయితే, తీరా అసలు సంగతి తెలుసుకుని ‘ఇంతేనా’ అనుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ జరిగింది.. మణిపుర్లోని […]
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్కు చెందిన జనతాదళ్ (యు)కు లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్కు మధ్య బేధాభిప్రాయాలు గురువారం తారాస్తాయికి చేరాయని పాట్నాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు తలెత్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న నితీష్ కూటమికి హ్యాండ్ ఇచ్చి .. రాబోయే లోకసభలో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. జేడీయూ కొత్త చీఫ్గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నియమితులయ్యారు.శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి మొత్తం 75 శాతానికి పెంచే ప్రతిపాదనను బీహార్ కేబినెట్ ఆమోదించింది.
బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులాల సర్వే ఆధారంగా ప్రజల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం మంగళవారం డేటాను విడుదల చేసింది. . డేటా ప్రకారంఅగ్రవర్ణాల్లో భూమిహార్లలో పేదరికం ఎక్కువగా ఉంది. బీహార్లో 27.58 శాతం భూమిహార్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని డేటా పేర్కొంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీష్ కుమార్ వెంట డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం జరిగింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఆయన డిప్యూటీ తేజస్వి యాదవ్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు రాహుల్ గాంధీతో సమావేశమై సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.