Home / Mamata Banerjee
West Bengal CM Mamata : వక్ఫ్ చట్టం అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో మొదలైన నిరసనలు చివరికి ఉద్రిక్తంగా మారాయి. అల్లర్లపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని ఆమె మండిపడ్డారు. బెంగాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడి కొందరు గూండాలు యువకులను టార్గెట్ చేసుకొని రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమయ్యారని ఆమె ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.. బెంగాల్లో హింస వెనుక […]
Protest against Waqf Act in Bengal: ఇటీవల లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభిచింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుననాయి. తాజాగా చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో మళ్లీ నిరసనలు చేలరేగాయి. శనివారం మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనకారులను ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో హింసాత్మక పరిస్థితి నెలకొంది. 110 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు […]
Mamata Banerjee : 8 రోజుల మిషన్ కోసం అని వెళ్లి దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములను అభినందిస్తున్నారు. […]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బుధవారం నాడు తేల్చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక జాతీయ అంశాల గురించి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆలోచిద్దామని అన్నారు. దీనితో కాంగ్రెస్కు దీదీకి మధ్య సంబంధాలు చెడిపోయినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు, ఆమె భారత ప్రధాని అయి ఉండాల్సిందని అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీష్ కుమార్ వెంట డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం జరిగింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం పంపిన లేఖపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య మళ్లీ మాటల యుద్ధంమొదలైంది.ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ పంపగా, వాటిలో బెంగాల్ ఒకటి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ ఆధార్ కార్డులను, ఆధార్ కార్డులు లేని వారిని గుర్తించాలని పేర్కొంది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు గాను 35 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని, లక్ష్యాన్ని సాధిస్తే టీఎంసీ ప్రభుత్వం మనుగడ సాగించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.2024లో నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కూడా అమిత్ షా చెప్పారు.
ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు.