Home / Latest News
ఆత్మహత్యకు యత్నించిన ఒక వృద్ధురాలు ఏకంగా 55 బ్యాటరీలు మింగేసింది. ఆఖరికి వైద్యులు ఆమెకు సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన ఐర్లాండ్ దేశంలో చోటుచేసుకుంది.
చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్లో 60మంది అమ్మాయిల వీడియో లీక్ అనే వార్త విధితమే. ఈ సంఘటనతో ఆందోళనలతో యూనివర్సిటీలో అట్టుడికింది. కాగా ఈ ఘటనలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారులు హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్ను సస్పెండ్ చేశారు.
బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని వరుస సీజన్లతో దూసుకుపోతుంది. కాగా సీజన్ 6 కొద్దిరోజుల ముందే ప్రారంభం అయ్యింది. దీనిని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారే చెప్పవచ్చు. కాగా మరి ఈరోజు అనగా బిగ్ బాస్ ఇంట్లో 15వ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యంది.
వినాయకుడి విగ్రహం పాలు తాగడం... చెట్టు నుంచి పాలు కారడం... వంటి వాటిని మనం వినే ఉంటాం. కాగా వీటిని కొందరు హిందువులు దైవం చేస్తున్న అద్భుతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.
కొందరు వ్యాపారులు చేస్తున్న పనులు చూస్తుంటే పట్టలేనంత కోపం వస్తుంది. అలాంటి వారిని అస్సలు సహించకూదని వారికి తగినబుద్ధి చెప్పాలనిపిస్తుంది. అయితే పానీపూరీ విక్రయించే చిరు వ్యాపారులు కొందరు అందులో మురుగు నీరు కలపడం, హోటళ్లలోని ఆహారపదార్దాల తయారీలో ఉమ్మి, చెమట వేయడం, వంట చేసే దగ్గర శుభ్రత పాటించకపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. కాగా ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరుస ప్రమాదాలు చైనాను వెంటాడుతున్నాయి. తాజాగా నైరుతి చైనాలో చోటుచేసుకొన్న ఓ రోడ్డు ప్రమాదంలో 27మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు
పాఠశాల లిఫ్ట్ లోపల కాలు, బయట శరీరం ఇరుక్కుని ఒక ఉపాధ్యాయురాలు మరణించింది. ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో జరిగింది.
గణేష్ నిమజ్జనం వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టే ప్రాంతాల్లో ఢీల్లీ తర్వాత హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది వినాయక విగ్రహ ప్రతిమలను ఊరేగింపు అనంతరం ఆయా ప్రాంతాల్లో కేటాయించిన ప్రదేశాల్లో గణనాధుడిని నిమజ్జనం చేస్తుంటారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాశలతో నిమజ్జన వేడుకలను విజయవంతం చేసేందుకు కీలక వ్యవస్ధలను ఉపయోగించుకొనింది.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా ఆయన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో చీపురు పట్టి ఊడ్చారునేటి నుండి, దేశంలోని భారతీయ రైల్వేలు, పోస్టాఫీసులు, టెలికాం, ఐటీ మరియు ఇతర విభాగాలలో పరిశుభ్రత కోసం ప్రచారం ప్రారంభమైంది.