Home / Latest Business News
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అధిక ధరలతో దూసుకుపోతున్న బంగారం.. మంగళవారం కాస్త వెనకడుగు వేసింది. తూలం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కిలోకు కేవలం రూ.200 మాత్రమే తగ్గింది.
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (మే 1) మాత్రం బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట లభించింది అని చెప్పాలి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా..
భారతదేశం మరియు రష్యాలు పరస్పరం దేశంలో రూపే మరియు మీర్ కార్డులను అంగీకరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంస్కృతిక సహకారం (IRIGC-TEC)పై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి అంతర్గత ప్రభుత్వ కమిషన్ సమావేశంలో, ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతించే అవకాశాన్ని అన్వేషించడానికి చర్చించి, అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైపైకి పోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరల్లో మార్పు లేకపోవడం గమనార్హం. ఆదివారం (ఏప్రిల్ 30) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.
ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి సదరు నిధులను అందుకున్నట్టు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే సోదాలు చేసినట్టు ఈడీ వెల్లడించింది.
బులియన్ మార్కెట్లో ఇటీవల గమనిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కాగా శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం బంగారం, వెండి రేట్లు కొంచెం తగ్గి ఊరటని ఇచ్చాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా కొనసాగుతోంది.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి.. కానీ ఈరోజు (ఏప్రిల్ 28) కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,950లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,040 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం
ప్రైమ్ యూజర్లకు అమెజాన్ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది మార్చి నెలలో ఆధార్ హోల్డర్లు దాదాపు 2.31 బిలియన్ ప్రామాణీకరణ లావాదేవీలను నిర్వహించారు. ఇది దేశంలో ఆధార్ వినియోగం,మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరగడాన్ని సూచిస్తుంది.
బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 27, 2023) నాడు దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 లు ఇవాళ రూ. 100 పెరిగి అది రూ. 55,950 కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 110 పెరిగి రూ. 61,040 గా ఉంది.