Home / HCU
Telangana Deputy CM Bhatti Vikramarka ordered withdraw the cases on HCU students: హెచ్సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజాసంఘాల ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ప్రజాసంఘాల నుంచి […]
HCU Land Dispute Case postponed to 24th April 2025 by High Court: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ వాయిదా పడింది. హై కోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. భూ వివాదం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. కేసులో కౌంటర్, రిపోర్టు ఈ నెల 24లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. యూనివర్సిటీ భూముల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ […]
CM Revanth Reddy Review Meeting with Ministers on Kancha Gachibowli Land Cases: హైదరాబాద్ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తున్న ఫేక్ వీడియోలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారన్నారు. ఫేక్ కంటెంట్పై విచారణ జరపాలని కోర్టును కోరాలని అధికారలను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఫేక్ […]
Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్సీయూలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు భూములను తీసుకోవద్దని, అక్కడ ఉన్న చెట్లను తొలగించొద్దని యూనివర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనలు ఘర్షణలకు దారి తీశాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి.. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు […]
Bhatti Vikramarka : హెచ్సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై లాఠీఛార్జీ జరగడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడ ఉన్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. […]
Supreme Court Judgement on HCU lands: హైదరాబాద్లోని హెచ్సీయూ భూములపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కంచ గచ్చిబౌలిలోని భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. తుది ఆదేశాల వరకూ కంచ గచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను త్వరలోనే సందర్శించాలని, అనంతరం ఓ నివేదిక […]
High court : కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హైకోర్టులో దాఖలు చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న కోర్టు.. కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది. జీవో 54 తీసుకొచ్చిన ప్రభుత్వం.. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, […]
High Tension At HCU Campus Lathi Charge: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీ గేటు లోపల ఉంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా నిరసన చేపడుతున్నారు. 400 ఎకరాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలోనే విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు ఈస్ట్ క్యాంపస్ వైపు ర్యాలీగా బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొని విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. అయితే రెండు […]
Renu Desai request to CM Revanth Reddy to HCU incident: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూములపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ భూములు హెచ్సీయూకి చెందినవ అని, ఈ భూములను వేలం వేయవద్దంటూ విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అయితే విద్యార్థులు ప్రతపక్షాలు బీఆర్ఎస్, బీజీపీతో పాటు బీజేవైఎం, సీపీఎం, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఈ విషయంపై నటి రేణుదేశాయ్ […]
High Tension at Hyderabad Central University: హైదరాబాద్లోని హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ నినాదాలతో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనకు ఏబీవీపీతో సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హెచ్సీయూ వైపు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు […]