Home / crime news
Delhi Crime: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని చంపేసి.. ఫ్రిజ్ లో దాచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని.. చంపేశాడు ప్రియుడు. ఇలా చేసిన కొన్ని గంటలకే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో కొట్టినట్టు వాణీ జయరాం నుదురు, ముఖం పై గాయాలున్నాయి.
Viral Video: మృత్యువు ఏ దారి నుంచి ఎలా వస్తుందో.. ఎప్పుడో వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఏం జరిగిందో అని అర్ధమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. ఇలాంటి ఊహించని ప్రమాదాలు.. ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఓ షాకింగ్ ఘటనే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. ఈ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది.
Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా బాగ్ లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుభకార్యాలకు ఉపయోగించే.. డెకరేషన్ సామాగ్రి దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో.. డెకరేషన్ సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది.
పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించిన దుండగులు ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Asaram Bapu: ప్రముఖ.. ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు గుజరాత్ కోర్టు జీవితఖైదు విధించింది. 2013 నాటి అత్యాచార కేసులో దోషిగా తేలడంతో.. గాంధీనగర్ కోర్టు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది. కానీ ఇప్పటికే.. మరో రేప్ కేసులో ఆశారం బాపూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు
Terror Attack: పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య.. ప్రస్తుతం 93 కు చేరింది.
Road Accident: సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలను చెందిన స్కూల్ బస్సును.. ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 20మంది విద్యార్ధులకు తీవ్రగాయలవ్వగా.. బస్సులో ఉన్న మరో పది మందికి సైతం గాయపడ్డారు.
Pakistan Blast: పాకిస్థాన్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
Odisha Minister: ఒడిశాలో కాల్పులు కలకలం రేపాయి. ఏకంగా మంత్రిపైనా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బ్రెజరాజ నగర్లోని గాంధీ చౌక్ వద్ద మంత్రి నబకిశోర్దాస్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు.