Home / Ayyanna Patrudu
తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దర మాజీ మంత్రులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసులో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయం స్థానం అనుమతి ఇవ్వగా.. పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్ కు కూడా సుప్రీం డిస్మిస్ చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆధారాలు మాయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో రుషికొండను కళ్లారా చూడాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు.
2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న కారణంగా తెల్లవారుజామున నానా హడావుడి చేసి తెదేపా నేత అయ్యన్న పాత్రుడితోపాటు కుమారుడు రాజేశ్ పై సీఐడి పోలీసులు పెట్టిన కేసులో 467 సెక్షన్ వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.
సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు.
అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎంత స్థలం కబ్జా చేశారనేది అనేది మాకు ముఖ్యం కాదు. ఫోర్జరీ చేశారు అనేది మాకు ముఖ్యం. అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాములు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీఐడీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేసినట్లు ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ తెలిపారు.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుతో విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద గుమికూడారు.
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది.