Home / Assembly
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ప్రజలు ఇచ్చిన తీర్పును నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. అందెశ్రీ కవితతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సారి అసెంబ్లీలోకి నన్ను ఎవడు అడుగు పెట్టనీయడో నేను చూస్తాను.. అసెంబ్లీలోకి జనసేన అడుగుపెడుతుంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలెంజ్ చేసారు. బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రికి చాలెంజ్ చేస్తున్నాను. వైసీపిని పడదోస్తాము. కూలదోస్తామని స్పష్టం చేసారు
Kcr vs Governer: కేసీఆర్ వర్సెస్ గవర్నర్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నువ్వా నేనా అన్నట్లు ఉన్న ఈ వివాదం.. ఇప్పుడు న్యాయస్థానం దాకా వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఓ వైపు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన బీఆర్ఎస్ నేతలు.. ఏకంగా హై కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను చర్చించకుండా విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. బయట మీడియా ముందు డ్రామాలు ఒక్కటే తెదేపాకు తెలుసునని మంత్రి కాకాని ఎద్దేవా చేశారు.