Last Updated:

NIA Raids: టెర్రర్ ఫండింగ్ కేసు.. జమ్ము కశ్మీర్ లో ఎన్ఐఏ దాడులు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

NIA Raids: టెర్రర్ ఫండింగ్ కేసు.. జమ్ము కశ్మీర్ లో ఎన్ఐఏ దాడులు

Srinagar: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్, జమ్మూ, శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, షోపియాన్, బందిపోరా జిల్లాల్లోని ప్రాంతాల్లో ఎన్ఐఏసోదాలు నిర్వహిస్తోంది. రాజౌరీ జిల్లాలో అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించబడిన జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్‌కు ఫ్రంటల్ ఎంటిటీగా పనిచేస్తున్న అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క నిధుల తీరు మరియు కార్యకలాపాలపై ఎన్‌ఐఎ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఎన్ఐఏ బృందాలు నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ దాడులు నిర్వహించాయని వర్గాలు తెలిపాయి.జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సమన్వయంతో ఈ దాడులు జరిగాయి.

ఇవి కూడా చదవండి: