Indian Railway: నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త రైల్వే ఛార్జీలు.. పెంచిన భారతీయ రైల్వే

Railways Fare Hike: కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్లో నిబంధనల అమలుపై రైల్వేబోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. నేటి అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్లు అమలులోకి వస్తాయని తెలిపింది. తత్కాల్ టికెట్ల బుకింగ్కు రైల్వేశాఖ ఆధార్ను తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి అమలులోకి తీసుకురావాలని అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వేశాఖ సర్క్యులర్ జారీ చేసింది. నేటి అర్ధరాత్రి 12 నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలులోకి రానున్నాయి.
సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉండనున్నాయి. 501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్పై రూ.5 పెంచారు. 201 కిలోమీటర్ల నుంచి 2500 కిలోమీటర్ల వరకు టికెట్పై రూ.10, 2501 నుంచి 3వేల కిలోమీటర్ల వరకు టికెట్పై రూ.15 చొప్పున పెంచారు.
ఆర్డినరీ స్లీపర్ తరగతి, ఫస్ట్ తరగతి ఆర్డినరీ టికెట్లపై కిలోమీటరుకు అరపైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్ప్రెస్ (నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు. అన్ని రకాల రైళ్లలో ఏసీ అన్ని తరగతులకు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. రిజర్వేషన్ ఛార్జి, సూపర్ఫాస్ట్ సర్ఛార్జీల్లో మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు అమలు కావని తెలిపింది.