Last Updated:

Heeraben Modi : ముగిసిన హీరాబెన్ మోదీ అంత్యక్రియలు… పాడె మోసి… చితికి నిప్పంటించిన మోదీ

Heeraben Modi : ముగిసిన హీరాబెన్ మోదీ అంత్యక్రియలు… పాడె మోసి… చితికి నిప్పంటించిన మోదీ

Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన తల్లి హీరాబెన్‌ మోదీ ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు.

ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జూన్‌ 18న వందేళ్లు పూర్తి చేసుకున్నారు. వందేళ్ల వయస్సు ఉన్నప్పటికీ నిన్నమొన్నటి వరకూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కొద్దిరోజుల క్రితం నుంచి మాత్రం ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు  వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రధాని మోదీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ ప్రధాని మోదీ చెప్పేవారు. తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఆమెకు నివాళులు అర్పించారు.

అనంతరం అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. తర్వాత ఆమె పార్థివ దేహంతోనే పాటు అంతిమయాత్ర వాహనంలో వెళ్లారు.  సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించినట్లు తెలుస్తుంది.  చాలా సాధారణంగా ఈ అంతిమాయాత్రను ముగించారు. చివరిగా మోదీ ఆమె చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి: