Home / జాతీయం
టెక్నాలజీ పరంగా ఎంతగా ఎదిగినా మనిషి మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నాడు. శివుడి ఆజ్ఞ అంటూ ఓ చిన్నారిని ఇద్దరు దుర్మార్గులు బలితీసుకున్నారు. ఈ అమానవీయ దారుణ ఘటన ఢిల్లీలోని లోధిలో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూర్ చేరుకున్నారు.
భారత ఎన్నికల సంఘం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలను ప్రకటించింది.
ఇరాన్ నుండి చైనాకు వెళ్లుతున్న ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భారత్ వైమానిక అధికారులు అప్రమత్తమైనారు. సాంకేతిక కారణాలతో భారతదేశంలో చైనా వెళ్లే విమానాన్ని అత్యవసరంగా దింపేందుకు అనుమతి నిరాకురించారు
దేవీనవరాత్రుల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తూ ఆ ప్రాంతవాసులు జగన్మాతను ఆరాధిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ యువకుడు డాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు. దీనితో శరన్నవరాత్రి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
కోల్కతాలోని ఒక దుర్గా మండపంలో 'మహిసాసురుడి స్థానంలో మహాత్మా గాంధీని పోలి ఉండేలా రూపొందించడం జాతిపిత జయంతి రోజున వివాదాన్ని సృష్టించింది.
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్ను మార్కెట్లో విడుదల చేయనుంది.
దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని భదోహిలో చోటుచేసుకుంది.
భాజపా, ఏకనాధ్ షిండేల సంకీర్ణంతో ఏర్పడిన మహారాష్ట్ర సర్కారు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పాశ్చాత్య భాషకు చరమగీతం పాడుతూ హలో అనే మాటకు బదులుగా వందేమాతరం అంటూ అభినందించాలంటూ కొత్త చట్టం తెచ్చింది
సుజ్లాన్ గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తులసి తంతి మరణంపై ట్విట్టర్ స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విండ్ ఎనర్జీ వ్యాపారానికి మార్గదర్శకుల్లో తులసి తంతి ఒకరుగా పేర్కొన్నారు