Home / జాతీయం
Operation Kagaar: ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. కాగా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టినట్టు […]
Mumbai To Pune: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్ అదుపుతప్పి 20 నుంచి 25 వాహనాలను ఢీకొంది. రాయ్ గఢ్ జిల్లాలోని ఖలాపూర్ తాలూకా ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అదోషి సొరంగం సమీపంలోని ముంబై- పుణే హైవేపై ఇవాళ జరిగింది. ట్రక్ చేసిన బీభత్సంలో ఓ వ్యక్తి స్పాట్ లోనే చనిపోగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న […]
Child bites Cobra Snake to Death: ఏడాది బాలుడి చేతికి నాగుపాము చుట్టుకున్నది. దీంతో నోటితో కొరికి పామును చంపాడు. తర్వాత బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బెట్టియా పరిధిలోని గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి సమీపంలో కట్టెలు సేకరిస్తున్నది. ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. నాగుపాము అక్కడకు […]
Ashok Gajapathi Raju: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఇవాళ ఉదయం గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. పీఎస్ శ్రీధరన్ పిళ్లై స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం ప్రమోద్ సావంత్తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. అశోక్ గజపతి రాజు […]
Bihar CM Nitish Kumar: ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బిహార్ సీఎం నితీశ్ కుమార్కు గట్టి షాక్ తగిలింది. బిహార్లో కొంతకాలంగా జరుగుతున్న నేరాలపై స్వపక్షం నుంచి విమర్శలు ఎదురయ్యాయి. నితీశ్ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానని కేంద్రమంత్రి, ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ అన్నారు. తాజాగా బిహార్లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. అంబులెన్స్లో ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన దుమారం […]
Karnataka: ముఖ్యమంత్రి మార్పు అంశంపై కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఐదేళ్లపాటు తానే సీఎంనని సిద్ధరామయ్య చెబుతున్నా తన చేతుల్లో ఏమీ లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంటున్నా సీఎం పీఠం విషయంలో ఇద్దరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇటీవల ఢిల్లీలోని కర్ణాటక భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ప్రత్యేక అధికారులు పరస్పరం దాడి చేసుకున్నట్లు […]
Good News: ఉద్యోగాల కల్పనకు కేంద్రం పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ స్కీమ్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 1 నుంచి అమలయ్యే పథకం కోసం రూ. 99 వేల 446 కోట్లు కేటాయించనున్నారు. PM VBRY పథకం తొలిసారి ఉద్యోగం పొందిన EPFO ఖాతాదారులకు కేంద్రం రూ.15,000 చెల్లించనుంది. ఉద్యోగాలు […]
Fire Accident: శనివారం (జూలై 26) తెల్లవారుజామున నవీ ముంబైలోని తుర్భే MIDC ప్రాంతంలో ఉన్న ఒక కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో జరిగింది. అగ్నిమాపక దళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలియలేదు. దర్యాప్తు జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. […]
BJP MP Kangana Ranaut: ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎంపీ చేసిన విమర్శలతో హిమాచల్ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. హిమాచల్ప్రదేశ్లో పెరుగుతోన్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టకపోతే మరో ఉడ్తాపంజాబ్ అవుతుందని సర్కారుకు గవర్నర్ శివ్ప్రసాద్ శుక్లా బహిరంగ హెచ్చరిక చేశారు. 2012 నుంచి 2023 వరకు మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో 340 శాతం పెరుగుదల కనిపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ […]
Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడాదిలో 30 రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఉద్యోగులు ఆయా సెలవులను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. 20 రోజుల హాఫ్ పే లీవ్, 8 రోజుల క్యాజువల్ లీవ్, రెండు రోజుల పరిమిత సెలవులు ఉన్నాయి. రాజ్యసభలో ఎంపీ సుమిత్రా బాల్మిక్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సర్వీస్ రూల్స్ ప్రకారం కేంద్ర […]