Home / జాతీయం
Maharastra: మహారాష్ట్రలో త్రిభాషా విధానంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు చేస్తుండగా, తాము వ్యతిరేకమని ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిభాషా విధానంపై గతంలో మాషేల్కర్ కమిటీ ఇచ్చిన నివేదికకు యూబీటీ శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అంగీకారం తెలిపారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఆరోపణలను యూబీటీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. అబద్ధాలు మాట్లాడటం బీజేపీ జాతీయ […]
Fire in the Arabian Sea: భారత్ నుంచి ఒమన్కు వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న భారత నౌకాదళ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ సాయంతో నౌక వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఎంటి యీ చెంగ్ 6 అనే నౌక గుజరాత్లోని కాండ్లా నుంచి ఒమన్కు బయలు […]
Tejashwi Yadav: బీహార్కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా ఓ డ్రోన్ ఆయన మీదకు దూసుకొచ్చింది. ఇది చూసి అతడు షాక్ అయ్యారు. దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం పాట్నాలోని గాంధీ మైదానంలో ‘వక్ఫ్ బచావో, సంవిధాన్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతుండగా సభను కవర్ చేసేందుకు ఏర్పాటు […]
AI Digital Highway: జాతీయ రహదారుల రూపు మారిపోతున్నది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఉపయోగించబోతున్నది. వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏటీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ-గురుగ్రామ్లను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్వేపై స్మార్ట్ వ్యవస్థను ప్రారంభించింది. రహదారి దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హైవేగా గుర్తింపు పొందింది. అత్యాధునిక వ్యవస్థ 14 రకాల ట్రాఫిక్ […]
Puri Stampede: ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో కూడిన మూడు పవిత్ర రథాలు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. తెల్లవారుజామున […]
Karnataka: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఎ.ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మళ్లీ అదే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మరో రెండు, మూడు నెలల్లో డీకే కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు కృషిచేశారో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం అధిష్ఠానం శివకుమార్ గురించే మాట్లాడుతోందని చెప్పారు. ఈ ఏడాది […]
Puri Jagannath Rath Yatra Stampede: పూరీ జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాట మృతులకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు వెల్లడించారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కాగా పూరీ జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు పూరీకి చేరుకున్నారు. కాగా ఇవాళ తెల్లవారుజామున […]
Air India flight: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుట్రకోణంపై దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో AI-171 విమానం కూలిపోయి 279 మంది మృతిచెందగా, ఈ ఘటనలో కుట్ర కోణంపై తాము దృష్టి సారించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ చెప్పారు. విమాన ప్రమాదం కేసును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పుణేలో జరుగుతున్న ఓ కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడారు. […]
Ind vs Pak: పాకిస్థాన్లోని శనివారం జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక ఇండియా హస్తం ఉందని పాక్ సైన్యం చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దాడి వెనుక తమ హస్తం ఉందంటూ పాక్ సైన్యం చేస్తున్నవి పూర్తిగా తప్పుడు ఆరోపణలని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్లో శనివారం ఆత్మాహుతి దాడి […]
New Two Wheeler Rules: ఇకపై టూ వీలర్ కొనే వారు.. కచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. వాహనం నడిపేవారికి, వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ.. కేంద్ర మోటార్ వాహనాల చట్టం- 1989 పలు మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. కొత్త […]