Last Updated:

Haryana: 42 క్రిమినల్ కేసులున్న గ్యాంగ్‌స్టర్ ఇల్లు కూల్చివేత

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల బాటలోనే హర్యానాలోని మనేసర్‌లో శుక్రవారం ఓ గ్యాంగ్‌స్టర్ ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మనేసర్ గ్యాంగ్‌స్టర్ సుబే సింగ్ గుజ్జర్ అక్రమ ఇంటిని ధ్వంసం చేసింది.

Haryana: 42 క్రిమినల్ కేసులున్న గ్యాంగ్‌స్టర్ ఇల్లు కూల్చివేత

Manesar: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల బాటలోనే హర్యానాలోని మనేసర్‌లో శుక్రవారం ఓ గ్యాంగ్‌స్టర్ ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మనేసర్ గ్యాంగ్‌స్టర్ సుబే సింగ్ గుజ్జర్ అక్రమ ఇంటిని ధ్వంసం చేసింది. మనేసర్‌లోని నార్ గుజ్జర్ గ్రామంలో అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల గ్యాంగ్‌స్టర్ సుబే సింగ్ ఇంటిని శుక్రవారం మనేసర్ మున్సిపల్ కార్పొరేషన్ బృందం నేలకూల్చింది. గుజ్జర్ ప్రస్తుతం గురుగ్రామ్‌లోని భోంద్సీ జైలులో ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాంగ్‌స్టర్ల అక్రమ ఆస్తులను ధ్వంసం చేసారు. ఈ ఆస్తి విలువ రూ.4 కోట్లు ఉంటుంది. 150 మందికి పైగా పోలీసుల సమక్షంలో రెండు జేసీబీ యంత్రాల సహాయంతో కూల్చివేత జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న జిల్లా టౌన్ ప్లానర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, వ్యవసాయ భూమిలో ఇల్లు అక్రమంగా నిర్మించబడిందని చెప్పారు. సుమారు మూడున్నర వేల చదరపు గజాలలో నిర్మించిన ఇంటి సరిహద్దు గోడను గురువారం కూల్చివేసారు.

ఇల్లు ఖాళీ చేసిన తర్వాత, శుక్రవారం రెండవ రోజు కూల్చివేత చర్యను ప్రారంభించింది. ఇంటి నిర్మాణం కోసం డిపార్ట్‌మెంట్ నుండి ఎటువంటి ఆమోదం, లైసెన్స్ లేదా భూమి వినియోగాన్ని మార్చలేదు. ఇల్లు ఖాళీ చేయమని మేము ముందుగా నోటీసు అందించి చట్టం ప్రకారం చర్య తీసుకున్నామని అన్నారు. గ్యాంగ్‌స్టర్ సుబే గుజ్జర్ ఢిల్లీ, గురుగ్రామ్, మేవాత్, రేవారీ, పాల్వాల్ జిల్లాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఆయుధాలు కలిగి ఉండటంతో సహా 42 క్రిమినల్ కేసులతో సంబంధం కలిగి ఉన్నాడు.

ఇవి కూడా చదవండి: