Home / తెలంగాణ
5వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దామరగద్ద తహశీల్దారు వెంకటేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో చోటుచేసుకుంది.
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ నేత కే. కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఈ మేరకు లేఖను మీడియా ముందుంచారు. తన సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు తెలియచేసివున్నట్లు ఆయన తెలిపారు.
ఏపిలో ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పు బట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, ఆయన పేరు మార్పును ఎవ్వరూ అంగీకరించరు, నేను ఖండిస్తున్నానంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రమేయంతోనే హుజూరాబాద్ పురపాలక సంఘంలో రెండు కోట్ల మేర అవినీతి చోటుచేసుకొందని నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి, విద్యార్థులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
రాజాసింగ్ కు ప్రాణ హాని ఉందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడియాక్ట్ కింద జైల్లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు జైలు అధికారులు ములాఖత్ కు అనుమతించక పోవడాన్ని తప్పుబట్టారు
హైదరాబాద్ మెట్రో రైళ్లు ఆదివారం కిటకిటలాడాయి. ఆదివారం ఒక్క రోజే 3.5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేసారు. దీనికి కారణం ఉప్పల్ లో జరిగిన భారత్-ఆసీస్ ల మధ్య మ్యాచ్ జరగడమే కారణం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ను చూసేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.
ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7గంటలకు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించేందుకు మంత్రి శ్రీనివాస గౌడ్ ఉచిత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అవకాశం టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో చోటుచేసుకొన్న తొక్కిసలాటలో గాయపడ్డ క్రీడాభిమానులకు మాత్రమే.