Home / తెలంగాణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఐదో విడతలో భైంసా నుండి కరీంనగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్.
ఇంటగెలిచి రచ్చ గెలవమన్న సామెత ఉంది. దీనిని కేసీఆర్ నిజం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండు సార్లు సీఎం అయ్యారు. అంటే ఇంట గెలిచారు. దీనితో గులాబీ సారు ఇక ఢిల్లీ పై దృష్టి సారించారు.
నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.శుక్రవారం రోజు కేసీఆర్ దంపతులు లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.అంతేకాకుండా సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని కానుకగా ఇవ్వనున్నారని తెలిసిన సమాచరం.సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం నిర్మాణంతో ఎవ్వరికీ నష్టం రాదని కేంద్రం స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సల్ గత ఆగస్ట్ లో నియామకమైనారు. ఈ నేపధ్యంలో ఆయన అక్టోబర్ 1న హైదరాబాదుకు రానున్నారు.
ఏపీ ప్రభుత్వ తీరు పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉపాద్యాయుల పై కర్కశంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కేసులు పెడుతూ, జైల్లో వేస్తున్నారని మంత్రి హరీష్ మాట్లాడారు
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని మంత్రులు హరీష్ రావు, దయాకరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం. స్వీకరించడని కేంద్రం కోరడం జరిగిందని వారు తెలిపారు
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ అభ్యర్థులకు 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 అదనపు ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పధకం కేంద్రం యొక్క జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపికైంది. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం ఈ పధకం లక్ష్యం.
ఒకరు బిర్యానీ కోసం ఒకరు పాతబస్తీలో హల్చల్ చేశారనుకోండి. ఇదెక్కడి దాకా వెళ్లిందంటే బిర్యానీ కోసం ఆ సమయంలో తెలంగాణ హోంమంత్రికే ఫోన్ చేసేశారు. మరి ఎందుకు ఇలా చెయ్యాల్సి వచ్చిందో ఓ సారి ఈ కథనం చూసెయ్యండి.