Last Updated:

High Court: సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు

బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సింధు ఫౌండేషన్ కు మేనేజింగ్‌ ట్రస్టీగా పార్థసారథి రెడ్డి వ్యవహరిస్తున్నారు.

High Court: సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు

High Court: బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సింధు ఫౌండేషన్ కు మేనేజింగ్‌ ట్రస్టీగా పార్థసారథి రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే, 2018 లో హైదరాబాద్‌లోని ఖానామెట్‌ వద్ద క్యాన్సర్‌ హాస్పిటల్ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్‌కు కేటాయించింది.

ప్రభుత్వ జీవో కొట్టివేత(High Court)

అయితే, ఈ కేటాయింపుకు సంబంధించిన జీవోను సవాల్‌ చేస్తూ 2019 లో తెలంగాణ హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రైట్‌ సొసైటీ తో పాటు ఊర్మిళ, సురేశ్‌కుమార్ ఈ పిల్‌ వేశారు. ఈ పిటిషన్ పైసీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. భూ కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టి వేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా పునఃపరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.