Last Updated:

South Central Railway: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 38 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రటక జారీ చేసింది.

South Central Railway: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 38 ప్రత్యేక రైళ్లు

South Central Railway: అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రటక జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి డిసెంబర్, జరనవరి నెలల్లో ఈ రైళ్లు  శబరిమల ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

రైళ్ల రాకపోకలు ఇలా..
* హైదరాబాద్-కొల్లాం: డిసెంబరు 5, 12, 19, 26, మళ్లీ జనవరి 2, 9, 16
* కొల్లాం-హైదరాబాద్ : డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17
* నర్సాపూర్-కొట్టాయం: డిసెంబరు 2, 9, 16, 30, జనవరి 6, 13
* కొట్టాయం-నర్సాపూర్ : డిసెంబరు 3, 10, 17, 24, జనవరి 7, 14
* సికింద్రాబాద్-కొట్టాయం: డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8
* కొట్టాయం-సికింద్రాబాద్ : డిసెంబరు 4, 11, 18, 25, మళ్లీ జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.

ఇదీ చదవండి: కోతికి జీవిత ఖైదు.. ఎందుకో తెలుసా..?

ఇవి కూడా చదవండి: