Last Updated:

Indian Railways: ప్రయాణికులకు షాక్.. మరో 168 రైళ్లు రద్దు

రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా మరో 168 ట్రైన్స్‌ను క్యాన్సల్‌ అయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 168 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది.

Indian Railways: ప్రయాణికులకు షాక్.. మరో 168 రైళ్లు రద్దు

Indian Railways: రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా మరో 168 ట్రైన్స్‌ను క్యాన్సల్‌ అయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 168 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది.

వీటిలో 124 ట్రైన్స్‌ను పూర్తిగా, 44 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. మరో 14 రైళ్లను దారి మళ్లిస్తున్నామని, ఎనిమిది ట్రైన్లు రీషెడ్యూల్‌ చేస్తున్నామని పేర్కొనింది. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల కారణంగా రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని భారతీయ రైల్వే వివరించింది.

కాగా ఎక్కువగా ఉత్తరభారతం వైపు ప్రయాణం సాగించే రైళ్లే రద్దయ్యాయి. సతారా, బటిండా, ఫఠాన్‌కోట్‌, లక్నో, గోండా, గోరఖ్‌పూర్‌, న్యూఢిల్లీ, వడోదరా, రత్నగిరి, వారణాసి, కాన్పూర్‌ సెంట్రల్‌, సీతాపూర్‌, ఆనంద్‌ విహార్‌ జంక్షన్‌, అమృత్‌సర్‌ జంక్షన్‌, ఘజియాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సిన రైల్లే రద్దయ్యాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తెరిగి ట్రైన్‌ షెడ్యూల్స్‌ను చెక్‌ చేసుకుని ప్రయాణాలు ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, రద్దయిన రైళ్లకు సంబంధించి ముందుగానే టికెట్లు బుక్‌చేసుకున్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆ రైతుకు చలిమంటే చితిమంటైంది.. ఎంత ఘోరం !

ఇవి కూడా చదవండి: