Published On: March 7, 2026 / 03:12 PM IST
US-Israel-Iran War LIVE: లొంగిపోయే ప్రసక్తే లేదు.. అమెరికా అల్టిమేటంపై ఇరాన్ ఫైర్.. ముదురుతున్న పశ్చిమ ఆసియా యుద్ధం..!
- Written By:vamsi krishna juturi
మిస్సింగ్ పైలట్ కోసం సెర్చ్ ఆపరేషన్
March 7, 2026 / 04:58 PM IST1986లో గాలిలో మాయమైన ఇజ్రాయెల్ ఎయిర్మెన్ రాన్ అరద్ ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైన్యం తాజాగా లెబనాన్లో ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా, అతని ఆచూకీ కనుగొనాలనే పట్టుదలతో నిర్వహించిన ఈ మిషన్లో దురదృష్టవశాత్తూ ఎటువంటి ఆధారాలు గానీ, మృతదేహానికి సంబంధించిన అవశేషాలు గానీ లభ్యం కాలేదని సైన్యం శనివారం ప్రకటించింది. ఈ మిషన్ ఫెయిల్ అయినప్పటికీ, తమ సైనికుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు ఆపేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. ఒక లెజెండరీ మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసులో ఇప్పటికీ క్లారిటీ రాకపోవడం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి ఒక పెద్ద సవాల్గానే మారింది.
Latest Update
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం
March 7, 2026 / 04:55 PM ISTప్రస్తుతం పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ఇరాన్ నావికాదళం శనివారం నాడు ఇజ్రాయెల్తో పాటు యూఏఈ, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు జరిపినట్లు ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా యూఏఈలోని అల్-మిన్హాద్, అల్-దాఫ్రా బేస్లను టార్గెట్ చేశామని ఇరాన్ ఆర్మీ ధృవీకరించింది. ప్రాంతీయంగా రెండో వారంలోకి ప్రవేశించిన ఈ యుద్ధం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా వర్సెస్ ఇరాన్గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరుగుతుంటే, మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తమ దాడుల తీవ్రతను మరింత పెంచుతున్నట్లు సంకేతాలిస్తున్నాయి.
లెబనాన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్
March 7, 2026 / 04:52 PM ISTఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ సరిహద్దుల్లో ఒక రహస్య ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 40 ఏళ్ల క్రితం, అంటే 1986లో గల్లంతైన తమ ఎయిర్మెన్ రోన్ అరాద్ ఆచూకీ కోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రత్యేక దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే ఈ మిషన్లో ఎలాంటి పురోగతి లభించలేదని, రోన్ అరాద్కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదని ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్ సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదు కానీ, దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఆ అన్వేషణ మళ్లీ అసంపూర్తిగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ రెండు పరిణామాలు ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
March 7, 2026 / 04:49 PM IST
శ్రీలంక తీరంలో జరిగిన ఈ అనూహ్య ఘటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అమెరికా జలాంతర్గామి దాడిలో ఇరాన్కు చెందిన 'ఐఆర్ఐఎస్ దేనా' యుద్ధనౌక మునిగిపోవడం, ఆ వెంటనే లంక నావికాదళం రంగంలోకి దిగి 32 మంది ఇరాన్ సైనికులను కాపాడటం చకచకా జరిగిపోయాయి. అయితే, ప్రాణాలతో బయటపడిన ఈ సైనికులను తిరిగి ఇరాన్కు పంపవద్దంటూ అమెరికా నుండి ఒత్తిడి వస్తోందన్న వార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ న్యూఢిల్లీ వేదికగా స్పందిస్తూ, తాము కేవలం అంతర్జాతీయ చట్టాలకు లోబడి మాత్రమే వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.
March 7, 2026 / 04:36 PM IST
ప్రస్తుతం ఈ ఇరాన్ నావికులను శ్రీలంక ప్రభుత్వం తన సంరక్షణలో ఉంచుకుంది. అమెరికా ఒత్తిడిపై నేరుగా సమాధానం చెప్పనప్పటికీ, ఒక దేశంగా తమకున్న బాధ్యతలను, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తామని శ్రీలంక స్పష్టం చేయడం గమనార్హం. యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారా లేక దౌత్యపరమైన వ్యూహాలకు తలొగ్గుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపు 84 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాదకర ఘటనలో, మిగిలిన వారిని స్వదేశానికి పంపే విషయంలో శ్రీలంక అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
March 7, 2026 / 03:43 PM IST
ఇరాన్ ఇప్పుడు ఒక వైపు యుద్ధం, మరోవైపు అంతర్గత గందరగోళంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సరిగ్గా వారం రోజులుగా సాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియన్ శనివారం ఒక అనూహ్యమైన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రొఫెషనల్ సెటప్ లేకుండా, చాలా హడావిడిగా రికార్డ్ చేసిన ఆ వీడియోలో పొరుగు దేశాలపై జరుగుతున్న దాడులకు ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే, అసలు ట్విస్ట్ ఏంటంటే.. దాడులు ఆపాలని తాను శుక్రవారమే ఆదేశాలు ఇచ్చానని ఆయన పేర్కొనడం. దీన్ని బట్టి చూస్తే, ఇరాన్ రాజకీయ నాయకత్వానికి అక్కడి సాయుధ దళాలపై పూర్తి పట్టు లేదని, మిలటరీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టమవుతోంది.
March 7, 2026 / 03:40 PM IST
మరోవైపు ఇరాన్ పంపిన డ్రోన్లు, మిస్సైళ్లు గల్ఫ్ దేశాల్లో బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడం, సౌదీ అరేబియాలోని ఒక ప్రధాన చమురు కేంద్రం లక్ష్యంగా దాడులు జరగడం పశ్చిమ ఆసియాలో భయాందోళనలు పెంచాయి. బహ్రెయిన్లో జనం ప్రాణభయంతో షెల్టర్ల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు ఒకవైపు ఉన్నా, గ్రౌండ్ లెవల్లో దాడులు ఆగకపోవడంతో గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం శనివారం నుంచి పాక్షికంగా తన సేవలను పునరుద్ధరించడం కాస్త ఊరటనిచ్చే అంశం. యుద్ధ మేఘాల మధ్య ఇటు దౌత్యపరమైన క్షమాపణలు, అటు మిలిటరీ దూకుడుతో ఈ ప్రాంతం ఒక అస్థిరమైన అగ్నిపర్వతంలా కనిపిస్తోంది.
March 7, 2026 / 03:37 PM IST
దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆకాశాన్నంటే బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. కానీ శనివారం సీన్ రివర్స్ అయింది. ఇరాన్ నుంచి జరిగిన వైమానిక దాడులను అడ్డుకునే క్రమంలో ఒక అజ్ఞాత వస్తువును ఇంటర్సెప్ట్ చేయడంతో భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేసింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సైతం తమ అన్ని సర్వీసులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు క్యాన్సిల్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, DXB, DWC ఎయిర్పోర్టుల నుండి పరిమితంగా సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. కానీ ఎయిర్లైన్ నుంచి కన్ఫర్మేషన్ ఉంటే తప్ప ఎయిర్పోర్ట్కు రావొద్దని అధికారులు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం కారణంగా గ్లోబల్ ట్రావెల్ హబ్ ఇలా స్తంభించిపోవడం ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లను కూడా కుదిపేస్తోంది.
March 7, 2026 / 03:36 PM IST
లెబనాన్ సరిహద్దుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా, హిజ్బుల్లా ఫైటర్లు వారిని అడ్డుకున్నారు. నబీ షీట్ అనే పట్టణంలో ఇజ్రాయెల్ హెలికాప్టర్ల ద్వారా దిగిన సైనికులతో హిజ్బుల్లా భీకరంగా తలపడింది. ఒక శ్మశాన వాటిక సమీపంలో ఈ యుద్ధం జరిగిందని, ఇరుపక్షాల మధ్య కాల్పులు హోరెత్తాయని సమాచారం. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, సుమారు 35 మంది గాయపడ్డారు. సిరియా వైపు నుండి వచ్చిన హెలికాప్టర్లను తాము గమనించి ప్రతిఘటించామని హిజ్బుల్లా ప్రకటించడం ఈ యుద్ధం ఎంత తీవ్రంగా మారుతుందో తెలియజేస్తోంది. లోకల్ జర్నలిస్టుల కథనం ప్రకారం రాత్రంతా అక్కడ యుద్ధ విమానాల మోత, గన్ షాట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
March 7, 2026 / 03:35 PM IST
ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. పొరుగు దేశాలపై జరిగిన దాడులకు ఆయన క్షమాపణలు చెబుతూనే, ఒక కొత్త కండిషన్ పెట్టారు. తమ పొరుగు దేశాల నుంచి ఇరాన్పై దాడులు జరిగితే తప్ప, తాము ఆ దేశాల వైపు క్షిపణులు ప్రయోగించబోమని స్పష్టం చేశారు. గత వారం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత అక్కడ ఒక తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పడింది. ఈ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, పొరుగు దేశాలు తమ భూభాగాన్ని ఇజ్రాయెల్ లేదా అమెరికా దళాలకు సహకరించడానికి ఇస్తే మాత్రం ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇది ఒక రకమైన దౌత్యపరమైన వ్యూహం,హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు.
March 7, 2026 / 03:20 PM IST
ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గడం లేదు. శనివారం తెల్లవారుజామున సుమారు 80కి పైగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఇరాన్ రాజధాని టెహ్రాన్, సెంట్రల్ ఇరాన్పై విరుచుకుపడ్డాయి. ఇరాన్ సైనిక స్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఇతర కీలక మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తూ వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల వల్ల ఇస్ఫాహన్ ప్రావిన్స్లో కనీసం ఎనిమిది మంది పౌరులు మరణించారని, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ 'వేవ్ ఆఫ్ స్ట్రైక్స్' నిర్వహిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, ఇరాన్ చేస్తున్న దాడులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరిస్తోంది.
March 7, 2026 / 03:18 PM IST
ఈ ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన పుతిన్, ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఖమేనీ , ఇతర పౌరులకు సంతాపాన్ని తెలియజేశారు. రష్యా ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, బలాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఇరాన్కు సన్నిహిత మిత్రుడైన పుతిన్ మాటలను ఇటు పాశ్చాత్య దేశాలు, అటు ఇరాన్ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి రష్యా స్టాండ్ ఈ యుద్ధంలో చాలా కీలకంగా మారింది.
March 7, 2026 / 03:14 PM IST
ఇరాన్ తన పొరుగున్న ఉన్న అరబ్ దేశాలపై దాడులు చేయడంపై అరబ్ లీగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమన్, జోర్డాన్, ఈజిప్ట్ దేశాల కోరిక మేరకు ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ దాడులను అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబౌల్ ఘీత్ తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా, పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన కనీస మర్యాదలను తుంగలో తొక్కడమేనని ఆయన విమర్శించారు. ఇరాన్ చేస్తున్న ఈ 'స్ట్రాటజిక్ మిస్టేక్' వల్ల అరబ్ దేశాలతో సంబంధాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉందని, వెంటనే దాడులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అరబ్ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇరాన్ను ఒంటరిని చేసే వ్యూహంలో ఉన్నట్లు కనిపిస్తోంది.







_1772700785690.jpg&w=2560&q=75)
_1772611489392.jpg&w=2560&q=75)


