Home / అంతర్జాతీయం
Israel Hamas Conflict: భీకర దాడులతో గాజాలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 21 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య దాదాపు 60 వేలు దాటింది. 1.45 లక్షల మంది గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది. 24 గంటల్లోనే 113 మంది మృతిచెందారని, 637 మంది గాయపడ్డారని తెలిపింది. మొత్తం మృతుల సంఖ్యలో సామాన్య ప్రజలు, యుద్ధంలో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని […]
Earthquake in Andaman and Nicobar: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం వచ్చింది. అర్ధరాత్రి 12:11 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. కాంప్బెల్ బే నుంచి 62 కి.మీ. పశ్చిమ-నైరుతి దిశలో భూమి ఉపరితలం నుంచి 10 కి.మీల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ వెల్లడించింది. నికోబార్ దీవుల్లో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని తెలిపింది. […]
Nimisha Priya: యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసు మరోసారి మలుపు తిరిగింది. ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని అవన్నీ అవాస్తవాలని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారంటూ నిన్న (సోమవారం) అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ […]
30 killed in China Rains: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీవ్రమైన వరదలకు దారితీశాయి. బీజింగ్ వరదల కారణంగా 34మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 80వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ వర్షాలకు హబీ ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడడంతో నలుగురు మృతి చెందారు .అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అనేక ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడింది. బీజింగ్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మియున్ జిల్లాలో వరదల బీభత్సానికి అతలాకుతలమైంది. […]
USA: BreakingNews: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక పోలీస్ ఆఫీసర్ తో సహా ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన మిడ్టౌన్ మాన్హట్టన్ కార్యాలయ భవనంలోని పార్క్ అవెన్యూ టవర్లో జరిగింది. సామూహిక కాల్పుల్లో న్యూయార్క్ నగర పోలీసు అధికారితో సహా కనీసం ముగ్గురు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందాడు. అయితే కాల్పులు ఎందుకు జరిపాడో ఇంకా తెలియరాలేదు. విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. FBI డిప్యూటీ డైరెక్టర్ […]
Nimisha Priya: యెమెన్లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు ఊరట లభించింది. ఆమె మరణశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారు. నిన్న( సోమవారం) అర్ధరాత్రి ఈ నిర్ణయం తెలిపారు. ఈ ప్రకటనను భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి వెల్లడించారు. కానీ ఇంకా భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్లోని సనాలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. […]
Putin: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపానని పదే పదే చెబుతున్నారు. ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించారు. తాజాగా థాయ్లాండ్- కంబోడియా మధ్య కూడా యుద్ధాన్ని ఆపానని వెల్లడించారు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ముందుకొస్తుంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ముందుకు […]
Thailand-Cambodia: ఆగ్నేయాసియాలో యుద్ధమేఘాలు తొలగిపోయాయి. కొన్ని రోజులుగా సరిహద్దు ఘర్షణలో మునిగిన థాయ్లాండ్-కంబోడియా వెంటనే షరతుల్లేని కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని సోమవారం మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. రెండు దేశాలు కొన్నిరోజుల నుంచి సరిహద్దులో కాల్పులతో చెలరేగిపోతున్నాయి. ఎట్టకేలకు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. చర్చల కోసం సోమవారం మలేసియాలో భేటీ కావాలని రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో సానుకూల ఫలితం […]
Bangkok shooting: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. అనంతరం దుండగుడు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక మీడియా సంస్థల వివరాల ప్రకారం.. బ్యాంకాక్లోని ఓర్ టు కో మార్కెట్లోకి చొరబడిన దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఒక మహిళ మృతిచెందారు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం […]
Several killed in train accident Germany: జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలో ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైంది. రీడ్లింగెన్ పట్టణం సమీపంలో సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం […]