Last Updated:

“Bigg boss 48 day: బిగ్‌బాస్ ఇంట్లో డిజాస్టర్ గా నిలిచిన “వాసంతి”.. నాగార్జున చేతిలో రేవంత్ కి క్లాస్

బిగ్‌బాస్ ఇంట్లో 48వ రోజు ఏం జరుగుతుందో చూసేద్దాం. ఓడిపోయిన్ టీమ్ నుంచి ఎవరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాలి అనే విషయంపై ఇంట్లో డ్రామాలు సాగాయి. ఇదిలా ఉండగా రేవంత్ కి ఈ వీకెండ్లో నాగార్జున గట్టి క్లాసు తీసుకోబోతున్నట్టు ప్రోమోలో చూస్తే తెలుస్తోంది.

“Bigg boss 48 day: బిగ్‌బాస్ ఇంట్లో డిజాస్టర్ గా నిలిచిన “వాసంతి”.. నాగార్జున చేతిలో రేవంత్ కి క్లాస్

Bigg boss 48 day: బిగ్‌బాస్ ఇంట్లో 48వ రోజు ఏం జరుగుతుందో చూసేద్దాం. ఓడిపోయిన్ టీమ్ నుంచి ఎవరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాలి అనే విషయంపై ఇంట్లో డ్రామాలు సాగాయి. బిగ్‌బాస్ ఇంచి సభ్యులను రెండు టీంలుగా రెడ్ టీమ్, బ్లూటీమ్‌లలో విభజించి వారికి టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ టీమ్‌లు సాధించిన పువ్వులు, బొమ్మలు బట్టి బ్లూ టీం గెలిచింది. దానితో రెడ్ టీమ్‌లో ఉన్న వారిలో ఒకరు నేరుగా నామినేట్ అవ్వాలని చెప్పారు బిగ్‌బాస్. దీంతో శ్రీసత్య తాను నామినేట్ అవుతానని చెప్పింది. మరల ఏమైందో కానీ తెల్లారే సరికి ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంది అందరం డిస్కస్ చేద్దామని అడిగింది. ఇందులో భాగంగా గీతూ వాసంతి పేరు తెచ్చింది. నిజానికి వాసంతి గేమ్ ఆడింది గీతూ ఎప్పటి లాగే సరిగ్గా ఆడలేదు.
మొత్తానికి వచ్చే వారం వాసంతి నేరుగా నామినేట్ అవుతుంది.

జైల్లో వాసంతి.. 

ఇక గేమ్‌లో ఎవరి ఆట వరస్ట్ గా ఉందో చెప్పి ‘డిజాస్టర్’ అనే ట్యాగ్ ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పారు. అందులో భాగంగా రేవంత్ మాట్లాడిన మాటలు కొన్ని బాగోలేవని చెప్తూ అర్జున్ రేవంత్ కు డిజాస్టర్ ట్యాగ్ ఇచ్చాడు. ఇక వాసంతి గీతూకి ఇచ్చింది. తరువాత మెరీనా కూడా గీతూకే డిజాస్టర్ బ్యాడ్జ్ ఇచ్చింది. వాటికి గీతూ చాలా నిర్లక్ష్యంగా ఎప్పటిలాగే అవమానకరంగా వారికి సమాధానమిచ్చింది. శ్రీ సత్య రేవంత్‌ను నామినేట్ చేసింది. ఇక సూర్య తనకు సంబంధంలేని పాయింట్‌తో వాసంతికి బ్యాడ్జ్ ఇచ్చాడు. అలాగే గీతూ, రేవంత్, ఆదిరెడ్డి కూడా వాసంతికే నామినేట్ చేశారు. ఇలా నాలుగు డిజాస్టర్ బ్యాడ్జ్‌లు వాసంతికి వచ్చాయి. దీంతో ఆమెను జైల్లో వేయమని చెప్పారు బిగ్‌బాస్.

రచ్చ చేసిన గీతూ, వాసంతి – సూర్య గిఫ్ట్

ప్లాన్ చేసుకుని నన్ను నామినేట్ చేశావంటూ గీతూతో వాసంతి అంది. ఆ విషయంపై గీతూ మళ్లీ పంచాయతీ పెట్టింది. ఇక సీన్ కట్ చేస్తే అందరూ వెళ్లి జైల్లో ఉన్న వాసంతి దగ్గర ముచ్చట్లు పెట్టారు. ఇకపోతే ఇంటి సభ్యుల మధ్య నెయిల్ పాలిష్ ఛాలెంట్ పెట్టారు బిగ్‌బాస్. ఈ టాస్క్ ఏంటంటే జంటలుగా విడిపోయి అబ్బాయిలు, అమ్మాయిలకు నెయిల్ పాలిష్ పెట్టాలి. ఇందులో వాసంతి – సూర్య జంట గెలిచింది. వీరికి గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చారు బిగ్ బాస్.

రేవంతికి మూడింది

ఇదిలా ఉంటే వీకెండ్ వచ్చేసింది మరి హోస్ట్ నాగార్జు వచ్చి ఇవ్వాల ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఎవరెవరి క్లాస్ పీకుతాడో అని ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే రేవంత్ కి ఈ వీకెండ్లో నాగార్జున గట్టి క్లాసు తీసుకోబోతున్నట్టు ప్రోమోలో చూస్తే తెలుస్తోంది. పప్పూ నువ్వు కూర్చో అంటూ రేవంత్ ను నాగర్జున అంటారు అలా చాలా సార్లు పప్పు అని అంటారు. దానికి అర్జున్ తో రేవంత్ గొడవే కారణంగా తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం మొత్తం మీద ఇంటి సభ్యులు చాలా తప్పులు చేశారు. అందుకే వారికి ఈసారి గట్టి క్లాసు ఉంటుందని అర్థమైపోయింది.

ఇదీ చదవండి: నవ్వుతూ మాట్లాడుతూనే ఆది రెడ్డిని డీప్ గా హర్ట్ చేసిన గీతూ

ఇవి కూడా చదవండి: