Home / క్రికెట్
అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా రోహిత్ శర్మను కొనసాగించాలని భావించిన బీసీసీఐ.. ఈ టోర్నీలో పాల్గొన టీమ్కు రోహిత్ను సారధిగా నిమమించింది. వైఎస్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేసింది.
మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్లో ఆడే క్రెకటర్లు కోటీశ్వరులని చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఈ ఆటతో అనుబంధం ఉన్న వారు కూడా బాగానే సొమ్ములు వెనకేసుకుంటారు. తాజాగా మాజీ క్రికెట్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్కు స్కై స్పోర్ట్స్ నుంచి క్రికెట్కు సంబంధించి కామెంటరీ చేయాలని ఆఫర్ వచ్చింది. దీనికి సెహ్వాగ్ రోజుకు తనకు 10వేల బ్రిటిష్ పౌండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఐపీఎల్ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలిచాడు.
భారత పేస్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి అస్థానాను వివాహం చేసుకున్నాడు. అతని వివాహ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా స్వాతిని సైనీ పెళ్లి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా - టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ
ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.
వన్డే ప్రపంచకప్ లో వరుసగా ఆరు మ్యాచులను గెలిచిన ఇండియా ఏడవ మ్యాచులో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత పేసర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక బ్యాట్స్ మెన్ ఒకరి తరువాత మరొకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీనితో శ్రీలంక 55 పరుగులకే ఆలౌట్ అయి ఘోరపరాజయాన్ని పొందింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
దిగ్గజ స్పిన్నర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. 1967 మరియు 1979 మధ్య, దిగ్గజ స్పిన్నర్ భారతదేశం తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు పడగొట్టారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. బేడీ, ఎరపల్లి ప్రసన్న,చంద్రశేఖర్ మరియు వెంకటరాఘవన్లతో కలిసి భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో కీలకమైన ఆటగాడిగా నిలిచారు.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023.. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి నింపుతుంది.