Published On:

AP ICET: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. విశాఖ విద్యార్థికి మొదటి ర్యాంకు..!

AP ICET: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. విశాఖ విద్యార్థికి మొదటి ర్యాంకు..!

AP ICET Results: ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జీపీ రాజశేఖర్, ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఐసెట్‌ పరీక్ష 34,131మంది విద్యార్థులు రాశారు. 32,719 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్‌ పరీక్షలో 95.86 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ నంబర్ 9552300009లో ఫలితాలు పొందవచ్చు.

 

టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

ఐసెట్‌కు 37,572 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 94 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీన ఐసెట్‌ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 34,131 మంది హాజరయ్యారు. ఐసెట్‌లో 32,719 మంది క్వాలిఫై అయ్యారు. 15,176 మంది అబ్బాయిలు, 17,543 మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

 

మనోజ్‌ మేకా విశాఖపట్నం అత్యధిక మార్కులతో మొదటి ర్యాంకు సాధించింది. తర్వాత ర్యాంకుల్లో ద్వారకచర్ల సందీప్‌‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కడప జిల్లా, ఎస్‌. కృష్ణసాయి ఎన్టీఆర్ జిల్లా, వల్లూరి సాయిరాం సాత్విక్‌ హైదరాబాద్‌, రేవూరి మాధుర్య గుంటూరు, షేక్‌ బషీరున్నీషా అనకాపల్లి, వి.అజయ్‌ కుమార్‌ తిరుపతి, భీశెట్టి హరి వెంకటప్రసాద్‌ తూర్పుగోదావరి, ఎస్‌.గణేశ్‌‌రెడ్డి విశాఖ, మహేంద్ర సాయి చామా తిరుపతి నిలిచారు.

ఇవి కూడా చదవండి: