Home / ఆంధ్రప్రదేశ్
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేసు నమోదు నేపధ్యంలో దేశ వ్యాప్తంగా మరోమారు దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలంగాణ సీఎం కూతురు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగానే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న మహా పాదయాత్రను అడ్డుకొనేందకు అధికార వైకాపా సిద్దమైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.
లంచం వద్దు. జీతమే ముద్దు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవడం అందరికి తెలిసిందే. అయితే ప్రభుత్వ అధికారుల ఆలోచనలు మారడం లేదు. సరికదా మరింతగా పెట్రేగిపోతూ, సామాన్యులను దోచుకొంటున్నారు. ఈ తరహాలోనే లంచం తీసుకొంటూ ఓ ఉన్నతస్థాయి అధికారి ఏసీబి అధికారులకు చిక్కడంతో తిరుపతి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది
పేదలకు అన్నం పెట్టడాన్ని కూడా ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఎన్నో ప్రాంతాల్లో ఎవరో ఒకరు అన్నదానాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఏపీలో కేవలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ పేరుతో అన్నదానం చేస్తే మాత్రం ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కు సంబంధించి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నుంచి బస్సు యాత్రకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా బస్సు తయారు చేస్తున్నారు. హైదరాబాద్లో తయారవుతున్న ఈ బస్సుకు రెగ్యులర్ బస్లు, లారీలకు వాడే పెద్ద టైర్లు ఉపయోగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి సాయంత్రం వరకు డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.