Home / AP
Flood In Krishna River: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి కృష్ణా నదిలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్ట్ లకు భారీగా వరద వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కొత్తనీటితో ప్రాజెక్ట్ నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై మొదటి వారంలోనే ప్రాజెక్టులకు నీరు రావడంతో పంటలకు నీటి […]
Tirupati Govindaraja Swamy Temple: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగి రెండు షాపులు దగ్ధం అయ్యాయి. ఆ మంటలు కాస్త ఆలయం ముందు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు అంటుకుని కొంతమేర కాలిపోయాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో గోవిందరాజస్వామి ఆలయం వెలుపల పందిళ్లు కొంతమేర కాలిపోయాయి. మరోవైపు […]
Private Schools bandh In AP: రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు బంద్ చేస్తున్నట్టు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆవేదన అందరికీ తెలిసేలా కార్యక్రమానికి అందరి సహకారంతో కార్పొరేట్ స్కూళ్లు సిద్ధం కావాలని కోరారు. కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరుతో వేధిస్తున్నారని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆరోపించాయి. రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా 55 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్టు పేర్కొంది. అందుకే రేపు […]
Rain Alert To Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే రానున్న ఐదు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలోని అన్ని జిల్లాల్లో వచ్చే ఐదురోజులు […]
CM Chandrababu Tour In Kuppam: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా, నియోజకవర్గ నేతలు, కలెక్టర్, ఎస్పీ, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం తుంశి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం రూ. 1292. 74 […]
IPS Officer Resigned: ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను డీజీపీకి పంపినట్టు చెప్పారు. అయితే ఆయనకు సర్వీస్ ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. తన రాజీనామాకు పూర్తిగా వ్యక్తిగత కారణాలేనని స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎలాంటి ఒత్తిడి తనపై లేదని చెప్పారు. అయితే తనపై కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని తెలిపారు. […]
Sparsha Darshanam In Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉచిత స్పర్శదర్శనాలను నిన్నటి నుంచి దేవస్థానం ప్రారంభించింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఈ సేవను తిరిగి ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పర్శదర్శనం కోసం అధికారులు కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను ఆఫ్ లైన్ లో జారీ చేస్తారు. టోకెన్ పొందాలనుకునే భక్తులు తమ […]
Heavy Rains in Telugu States: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలోనూ […]
Party President Election Notification: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 1న బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్నిక నోటిఫికేషన్ జారీతో పాటు […]
Vizianagaram Terrorist Case: సంచలనం రేపిన విజయనగరం ఉగ్రకుట్ర కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు బదిలీ అయింది. సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ ఉగ్రకుట్ర కేసును ఏపీ ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. ఇద్దరు నిందితులు హైదరాబాద్, విజయనగరంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరపాలని కుట్ర ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. దీంతో సిరాజ్, సమీర్ ప్రస్తుతం […]