Published On:

Ind Vs Eng: టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్

Ind Vs Eng: టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్

England Elected Bowl In Barmingham Test: బర్మింగ్ హమ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. ముందుగా మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ 1-0 తేడాతో లీడ్ లో ఉంది. భారత్ సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ నుంచి తప్పకుండా గెలవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ కు తుది జట్టులో స్థానం దక్కింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వగా.. శార్దుల్ ఠాకూర్, సాయి సుదర్శన్ ను కూడా పక్కకు పెట్టింది.

ఇండియా:

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్:

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

ఇవి కూడా చదవండి: