Published On:

Violence: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు.. పోలీసుల భారీ భద్రత

Violence: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు.. పోలీసుల భారీ భద్రత

Manipur: కొంతకాలంగా ప్రశాంతంగా ఉంటున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మెయితీ తెగకు చెందిన వాలంటీర్ గ్రూప్ అరంబాయ్ టెంగోల్ నాయకుడు కానన్ సింగ్ ను ఇంఫాల్ లో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మెయితీ తెగకు చెందిన యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. షాపులను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లను కాల్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నినాదాలు చేశారు.

 

కానన్ సింగ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంఫాల్ లోని క్వాకైథల్ ప్రాంతంలో తుపాకీ చప్పుళ్లు వినిపించాయని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని భద్రతా బలగాలు తెలిపాయి.