Last Updated:

Kerala : ఆదిశంకరాచార్య క్రూరమైన కుల వ్యవస్థకు ప్రతినిధి… కేరళ మంత్రి ఎంబి రాజేష్

హిందూ తత్వవేత్త ఆదిశంకరాచార్యను "క్రూరమైన కుల వ్యవస్థ" యొక్క ప్రతినిధిగా కేరళ మంత్రి ఎంబి రాజేష్ పేర్కొన్నారు. కేరళలో నారాయణ గురు

Kerala : ఆదిశంకరాచార్య  క్రూరమైన కుల వ్యవస్థకు ప్రతినిధి… కేరళ మంత్రి ఎంబి రాజేష్

Kerala : హిందూ తత్వవేత్త ఆదిశంకరాచార్యను “క్రూరమైన కుల వ్యవస్థ” యొక్క ప్రతినిధిగా కేరళ మంత్రి ఎంబి రాజేష్ పేర్కొన్నారు. కేరళలో నారాయణ గురుదేవులు ఒక ‘ఆచార్య’ అని అన్నారు .కుల వ్యవస్థకు మద్దతు ఇచ్చినందున శంకరాచార్యను విమర్శించారు

సోమవారం వర్కాల శివగిరి మఠంలో జరిగిన కార్యక్రమంలో ఎంబి రాజేష్ మాట్లాడుతూ కేరళకు ఆచార్య ఉంటే అది శ్రీ నారాయణ గురువే తప్ప ఆదిశంకరాచార్యులు కాదు.. శంకరాచార్యులు మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన కుల వ్యవస్థను సమర్థించారన్నారు. శంకరాచార్య కుల వ్యవస్థను పారద్రోలేందుకు కృషి చేశారు. శంకరాచార్య కుల వ్యవస్థకు మద్దతు ఇవ్వడమే కాకుండా దాని ప్రతినిధిగా కూడా ఉన్నారని అన్నారు.

సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకు పోవడానికి శంకరాచార్యులే కారణమని మంత్రి అన్నారు. శంకరాచార్యుల తర్వాత శ్రీనారాయణ గురువే అని ఇప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాదు. శంకరాచార్యను విమర్శించిన వ్యక్తి గురువే. కుల వ్యవస్థ ప్రజలను కబళించిందని, దానికి శంకరాచార్యులు కూడా కారణమని శ్రీనారాయణ గురువే చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.

దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ స్పందిస్తూ, ఆదిశంకరాచార్య మరియు శ్రీ నారాయణ గురుదేవులు ఒకే భారతీయ వంశానికి చెందినవారు మరియు ఒకే దృష్టిని ముందుకు తెచ్చారు.ఎంబీ రాజేష్ హిందూమతంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ తప్పుడు ప్రచారం సృష్టించి ఒక వర్గం ఓట్లను పొందేందుకు సీపీఎం పన్నిన కుతంత్రం. శంకరాచార్యను అవమానించే ప్రయత్నాలను కొట్టిపారేయాలని మురళీధరన్ అన్నారు.ఆదిశంకరాచార్యులు అద్వైత వేదాంతానికి సంబంధించిన జ్ఞానం మరియు తత్వశాస్త్రాన్ని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాల సూత్రాలను కూడా బోధించారు.

ఇవి కూడా చదవండి: