Home / తెలంగాణ
CM Revanth Reddy: ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కులగణన చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సర్వే లెక్కల ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించి రాష్ట్రపతికి పంపామన్నారు. రిజర్వేషన్లపై పోరాడేందుకే […]
BRS Working President KTR: రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని ఆ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో అందరికీ న్యాయం జరిగిందని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉందన్నారు. భూములు విలువలు పడిపోయాయన్నారు. యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తోందన్నారు. పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెబుతున్నారని, […]
Harish rao Sensational Comments About Congress: కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లను రద్దు చేసిందన్నారు. అలాగే 2 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిందని ఆరోపించారు. హల్దీ, మంజీరాల మీద 8 చెక్ డ్యామ్లు నిర్మించామని.. హత్నూర, చిలప్ చెడు, వెల్దుర్తి మండలాలకు సాగునీరు కల్పించామన్నారు. రూ.4వేల పింఛన్ ఇస్తామని చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. […]
MLC Kalvakuntla Kavitha Sensational Decision About Kaleshwaram Commission Report: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎమ్మెల్సీ కవిత న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం నుంచి కవిత నివాసంలో కాళేశ్వరం నివేదికపై న్యాయనిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నారు. ఈ నివేదికపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కవిత నిర్ణయించారు. మరోవైపు, కవిత తరఫు న్యాయవాదులు న్యాయస్థానంలో నేడు లేదా మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారని […]
NHRC NOTICES: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాట ఘటనలో సీఎస్ రామకృష్ణారావుకు NHRC (జాతీయ మానవ హక్కుల కమిషన్) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనలో రేవతి మృతికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపింది. అలాగే, బాధితులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలిస్తామని పేర్కొంది. మానవ హక్కుల రక్షణ చట్టం సెక్షన్ 18 ప్రకారం.. పరిహారాన్ని కమిషన్ ఎందుకు సిఫార్సు చేయకూడదో వివరణ […]
School Holidays in AP and Telangana from August 8 to 10: విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాయి. ఈ మేరకు ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మూడు రోజులు సెలువులు ఉండనున్నాయి. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ సెలవులు డిక్లేర్ చేశారు. ఏపీలో ఈ నెల 8వ తేదీన శుక్రవారం వరలక్ష్మి వ్రతం […]
Telangana Congress plan Notices to Komati Reddy RajGopal Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయనకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ నోటీసులు జారీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. అయితే, గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మరో వైపు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో […]
Guvalla Balaraju: బీఆర్ఎస్ను వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖలు చేశారు. ఇవాళ నాగర్కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసమర్థ నాయకత్వం కుట్రలు చేసి తనను ఓడించిందంటూ బీఆర్ఎస్పై మండిపడ్డారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రను ప్రతిపక్షం బీఆర్ఎస్ పోషించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు కష్టకాలంలో అది నాయకత్వం అండగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అది చేయకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం […]
MLC Kavitha Sensational Comments About Congress Party: తెలంగాణలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జాతీయ పతాకం, తెలంగాణ జాగృతి జెండాలను ఎగరవేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. సాంస్కృతిక విప్లవంతో […]
Chiranjeevi: ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆయన పాటు యంగ్ హీరో తేజా సజ్జా కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో హీరో తేజా సజ్జా రక్తదానం చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. రక్తదానం అనే పదం వినగానే తన పేరు గుర్తొస్తే.. అది పూర్వజన్మ సుకృతమని హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి […]