Last Updated:

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ..14 రోజుల జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా

ఆమ్‌ఆద్మీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు మరోసారి చుక్కెదురయ్యింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

Delhi Liquor Scam:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ ..14 రోజుల జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైలుకు మనీశ్  సిసోడియా

Delhi Liquor Scam: ఆమ్‌ఆద్మీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు మరోసారి చుక్కెదురయ్యింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో మార్చి 20వరకు ఆయన తిహార్‌ జైల్లో ఉండాల్సి వస్తుంది. ఐదు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న సిసోడియాను నేడు దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా..(Delhi Liquor Scam)

మద్యం కుంభకోణం కేసులో వచ్చిన ఆరోపణలపై ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. తాజాగా అది పూర్తికావడంతో దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచారు. అనంతరం కస్టడీని పొడిగించమని సీబీఐ కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియ్‌ కస్టడీ విధించినట్లు తెలిసింది.మరోవైపు సీబీఐ విచారణ తీరును సవాలు చేస్తూ మనీశ్‌ సిసోడియా ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. సీబీఐ అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించింది. ఇదే సమయంలో సిసోడియాను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. ఐదు రోజుల పాటు ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది.

సీబీఐ అధికారులు మానసికంగా వేథిస్తున్నారు..

ఆదివారం, ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మానసికంగా వేధిస్తున్నారని మరియు ఈ కేసుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో కూడిన పత్రాలపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారని అన్నారు.18 లక్షల మంది పిల్లలకు మంచి విద్యను అందించడానికి అహోరాత్రులు కష్టపడిన మనీష్ సిసోడియా, అతని విద్యా నమూనాను ప్రపంచం మెచ్చుకుంటుంది… అమెరికా అధ్యక్షుడి భార్య భారతదేశానికి వస్తుంది, ఆమె మనీష్ సిసోడియా మరియు అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన పాఠశాలలను చూడాలనుకుంటున్నారు. ఈరోజు మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీలో మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు.

ఆప్ నేతలు రాజకీయం చేస్తున్నారు..

మరోవైపు ఆప్ మద్దతుదారులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని దరఖాస్తు దాఖలైంది. ఇకపై సీబీఐ కస్టడీ అవసరం లేదని, అవసరమైతే తర్వాత కూడా కోరవచ్చునని స్పష్టం చేసింది. నిందితుడిని మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతామని కోర్టు తెలిపింది. సిసోడియాకు భగవద్గీత, కళ్లద్దాలు, మందులు మొదలైనవాటిని జైలుకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చిందని సీభీఐ పేర్కొంది.