Last Updated:

Chinese village in Doklam: బరితెగించిన డ్రాగన్.. డోక్లాంలో కొత్త గ్రామం నిర్మాణం

చైనా పొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలతో బరితెగిస్తోంది. తాజాగా భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను ‘పంగ్డా’ అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్

Chinese village in Doklam: బరితెగించిన డ్రాగన్.. డోక్లాంలో కొత్త గ్రామం నిర్మాణం

Chinese village in Doklam: చైనా పొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలతో బరితెగిస్తోంది. తాజాగా భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను ‘పంగ్డా’ అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ తో ఈ దురాక్రమణ విషయం బట్టబయలైందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. స్పేస్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మక్సార్’ ఈ శాటిలైట్ ఇమేజెస్ ను విడుదల చేసిందని కథనాల్లో పేర్కొన్నారు. భూటాన్ సరిహద్దుల్లోని భూమిని ఆక్రమించి చైనా నిర్మించిన గ్రామంలోని ప్రతి ఇంటి ఎదుట కార్లు పార్క్ చేసి ఉన్నాయని ఆ ఫోటోలను బట్టి స్పష్టమవుతోంది.

భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో చైనా అక్రమంగా గ్రామాన్ని నిర్మించడం ఇది రెండోసారి. ఐదేళ్ల క్రితమే -2017లో అక్కడ ఓ గ్రామాన్ని చైనా నిర్మించింది. అయితే అప్పట్లో భూటాన్ లోని డోక్లామ్ ఏరియాలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణానికి తెగబడటం పై భారత్ స్పందించింది. భూటాన్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఆ ఏడాది దాదాపు 73 రోజుల పాటు భారత్, చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. దురాక్రమణవాదం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకుండా, భూటాన్ లోని డోక్లామ్ పీఠభూమికి దక్షిణ ప్రాంతంలో మూడో గ్రామాన్ని నిర్మించేందుకూ డ్రాగన్ కసరత్తు చేస్తోందని మీడియా కథనాల్లో ప్రస్తావించారు.

ఈ నిర్మాణాల ద్వారా డోక్లామ్ పీఠభూమిలోని వ్యూహాత్మక భాగాలపై పట్టు సంపాదించేందుకు చైనా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్ కు చెందిన సున్నితమైన సిలిగురి కారిడార్, సిక్కింకు చైనా బలగాలు చేరుకోవడానికి ఈ కొత్త గ్రామాల మీదుగా వెళ్లే మార్గం దోహదపడుతుందని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను భారత్ లోని మిగతా భూభాగంతో అనుసంధానించేది సిలిగురి కారిడారే. ఇక భూటాన్ దాదాపు 400 కిలోమీటర్ల సరిహద్దును చైనాతో షేర్ చేసుకుంటోంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు 2021 అక్టోబరులో భూటాన్, చైనా ‘త్రీ స్టెప్ రోడ్ మ్యాప్’ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకు ఆ రెండు దేశాల మధ్య 24 రౌండ్ల చర్చలు జరిగాయి. అయినా ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేకపోయాయి.

ఇవి కూడా చదవండి: