Last Updated:

Bandi Sanjay: నకిలీ గ్యాంగ్‌ ట్రాప్‌లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయి.. బండి సంజయ్

తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay: నకిలీ గ్యాంగ్‌ ట్రాప్‌లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయి.. బండి సంజయ్

Hyderabad: తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ ఢిల్లీలో కూర్చొని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించి స్క్రిప్టు రాసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఢిల్లీ నుండి రాగానే డీజీపితో సమావేశమైన ప్రలోభాల డ్రామాను నడిపించారని వ్యాఖ్యానించారు. నకిలీ గ్యాంగ్ ను పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు, ఫామ్ హౌస్ నుండి శాసనసభ్యులు 4గురిని నేరుగా ప్రగతిభవన్ కు ఎందుకెళ్లారో తెలియల్సి ఉందన్నారు. నలుగురు ఆణిముత్యాలు వెళ్లి నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో చిక్కకున్నారని ఆయన మీడియాతో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: DK Aruna: బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదు.. డీకే అరుణ

ఇవి కూడా చదవండి: