Last Updated:

TTD: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేశారు. సెప్టెంబరు 27 నుండి శ్రీవారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేప‌థ్యంలోసామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామివారి దర్శనంతో పాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పిస్తామని ఈవో ధర్మరెడ్డి తెలిపారు.

TTD: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఈవో

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేశారు. సెప్టెంబరు 27 నుండి శ్రీవారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేప‌థ్యంలోసామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామివారి దర్శనంతో పాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పిస్తామని ఈవో ధర్మరెడ్డి తెలిపారు.

తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ధర్మరెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, అక్టోబర్‌ 4న రథోత్సవం, అక్టోబర్‌ 5న చక్రస్నానం నిర్వహిస్తామన్నారు.

రూ. 300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, వృద్ధులు, విక‌లాంగులు, చంటి పిల్లల త‌ల్లిదండ్రుల‌కు ఇచ్చే అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు చేశామని ధర్మరెడ్డి తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నమని ధర్మరెడ్డి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: