Home / తెలంగాణ
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం భాగ్యనగరాన్ని కుదిపేస్తుంది. నగరంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం కేసీఆర్ అంటూ మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అధికార, విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తుంది.
బుడిబుడి అడుగుల ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన కొమురంభీం జిల్లా భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
సీఎం క్యాన్వాయా మజాకా. ఏ మార్గంలోనైనా సీఎం కాన్వాయ్ వస్తుంటే ఆ మార్గంలో పాదచారులకు, వాహనదారులకు తిప్పలు ఇక చెప్పనక్కర్లేదు. హైదరాబాదులోని ప్రధాన రహదారుల్లో అయితే ఇక ప్రజల పడే నరకం అంతా ఇంత కాదు. కాన్వాయ్ వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో వెళ్లిన కారణంగా ఓ మహిళ పై కేసు నమోదైన ఘటన తెలంగాణ విమోచన దినం నాడు చోటుచేసుకొనింది.
మద్యం మత్తులో స్విగ్గీ బాయ్ పై దాడికి దిగారు. పిడిగుద్దులతో చితకొట్టారు. వెంటపడి తరిమారు. చివరికి పోలీసుల చేతికి చిక్కిన ఆ ఘటన హైదరాబాదు చైతన్యపురి పిఎస్ పరిధిలో చోటుచేసుకొనింది
బిడ్డ పుడితే నామకరణం అనేది మధురానిభూతిని పంచే ఓ కుటుంబ పండుగ. ఆ ఆనంద క్షణాల కోసం ఆ ఇంటి పెద్దలు ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. మరింతగా సంబరిపడిపోతుంటారు. జన్మించిన బిడ్డలకు తమకు నచ్చిన విధంగా పేర్లను పెట్టుకొంటుంటారు. ఇది ప్రతి వక్కరికి తెలిసిందే. కాని పుట్టిన మా లక్ష్మికి నామకరణం చేసేందుకు 9ఏళ్ల పాటు నిరీక్షించారు ఆ జంట. చివరకు వారి కల సాకరం కావడంతో తబ్బిబ్బై సంబ్రమాశ్చర్యాలకు లోనైన ఆ సంఘటన తెలంగాణాలో చోటుచేసుకొనింది
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలపై తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాల నేపధ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలపై భాజాపా నేత విష్ణువర్ధన రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు
బాధ్యత లేని జీవితం బాధలను తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమల పేరుతో విలువైన జీవితాలకు విలువ లేకుండా చేసుకొంటున్నారు. ఓ మైనరు బాలిక గర్భం దాల్చిన విషయం కాస్తా పంచాయితీ పెద్దలకు చేరిన ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకొనింది.
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఓ మహిళ నుండి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు