Home / జాతీయం
ధోని సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కాగా 2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఇదే తరహాలో తన ముగ్గురు స్నేహితులు కూడా సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్ నాట పలు అనుమానాలకు తావిస్తోంది.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018లో రాష్ట్రంలోని తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పులకు సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక విచారణ కమీషన్ల నివేదికలను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఒడిశాలో దారుణం జరిగింది. అప్పు చెల్లించలేదని ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి స్కూటర్తో లాక్కెళ్లారు కొందరు యువకులు. ఈ ఘటన కటక్లో జరిగింది.
యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడించింది. కాగా ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటూ కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో కరోనా కొత్త రూపం కలవరపాటుకు గురి చేస్తోంది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకొనింది. కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్లున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.
కట్టుకున్న భార్యను మరో పర పురుషుడికి పడక సుఖం ఇవ్వాలని ఓ భర్త ఒత్తిడి చేశాడు. అనగా భార్య మార్పిడి క్రీడ (వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని అతడు తన భార్యని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించలేదని ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్లో ప్రాంతంలో వెలుగు చూసింది.
భారతదేశం మరియు విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు మరియు ట్రాఫికర్ల మధ్య బంధాన్ని భంగపరిచేందుకు ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మంగళవారం పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
ఓ మూడేళ్ల బాలుడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత చిన్నవయస్సులో ఆ బుడ్డోడి తెలివిని చూసి మచ్చటపడిపోతారు. మరి ఆ బుడ్డోడు ఎవరు ఏమని పోలీసులకు కంప్లెయింట్ చేశాడో చూద్దామా..
ఇకపై మనదేశ భాష అయిన హిందీలోనే వైద్యవిద్య కొనసాగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సును కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదివారం (అక్టోబర్ 16)న ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సబ్జెక్టులైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించిన మూడు వైద్యవిద్య హిందీ టెక్ట్స్ బుక్లను షా ఆవిష్కరించారు.