Home / ఆహారం
శీతాకాలం వచ్చిందంటే చాలు చలి వల్ల చాలామంది పలు రోగాల బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులు వాడుతున్నా సరే చాలా కాలం పాటు వదలదీ జలుబు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఆవిరి పట్టడం అన్నిట్లోకి మెరుగైన పద్ధతని ఆవిరి పట్టే ముందు ఆ నీటిలో నాలుగు రకాల పదార్థాలను వేస్తే మరింత తొందరగా జలుబును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన దుస్తులు, ఆహారపు అలవాట్లు, సౌందర్య చిట్కాలు వంటి విషయాల్లో జాగ్రత్తగా వహించాలి.
సాధారణంగా మనం తాగే నీరు స్వచ్ఛంగా ట్రాన్సపరెంట్ గా ఉంటుంటాయి. కానీ నలుపు రంగులో ఉండే తాగునీటిని ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు ప్రముఖ నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్స్ అంతా నలుపు రంగుంలో ఉంటే వాటర్ బాటిల్స్ పట్టుకుని తాగుతుండడం చూస్తున్నాము. ఇదేమైనా మందు అనుకుంటే పొరపాటే ఇదికూడా తాగునీరే అంటున్నారు. మరి ఈ మంచినీరుని బ్లాక్ ఆల్కలీన్ వాటర్ అంటారు.
నేటి తరం ప్రజలకు చాలా మందికి మన సంప్రదాయ వైద్యం గురించి కానీ ఆహార వ్యవహారాల గురించి కానీ పెద్దగా తెలియదని చెప్పవచ్చు. అయితే అలాంటి పురాతన సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఒకటయిన పిండి కూర ఆకు దీనిని పాషాణభేది, కొండపిండి చెట్టు, తెలగ పిండి చెట్టు అని కూడా అంటుంటారు. మరి ఈ మొక్క విశిష్టతలేంటి ఎక్కడ దొరకుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఆందోళన, ఒత్తిడి (స్ట్రెస్) అనేవి ఈరోజుల్లో ప్రతీ మనిషికీ చాలా కామన్ అయిపోయాయి. అయితే ఇంలాంటి సమయాల్లో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల స్ట్రెస్, ఆందోళనను అదుపులో ఉంచవచ్చని చెప్తున్నారు నిపుణులు. సరైన పోషకాహారం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకుందాం.
సాధారణంగా చాలా పండ్లు, కూరగాయలకు తొక్కను తీసేసి వండడం, తినడం చేస్తుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లకు తొక్కలను తీసి పారేయడం వల్ల ఆ తొక్కలోనే ఉన్న పోషకాలన్నీ పోతాయి. మరి అలాంటి వెజ్జీస్ మరియు ఫ్రూట్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వ్యాధులు వస్తాయి. అయితే చలికాలంలో వచ్చే ఈ సమస్యల నుంచి సులభంగా ఈ ఒక్క సహజసిద్ధమైన ఉసిరితో చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
సాధారణంగా మనం తినే దోశ ఖరీదు రూ.30 నుంచి రూ.80 వరకూ ఉంటుంది. కానీ కర్ణాటకలోని ఒక హోటల్లో మాత్రం దోశ ఖరీదు ఏకంగా రూ.1001గా నిర్ణయించారు.
ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద నివాస కాలనీ రోహిణిలోని శివచౌక్ చాలా ప్రసిద్ధి.ఇక్కడ కొత్త టీ సెంటర్ను ప్రారంభించారు. 'ఇష్క్-ఎ-చాయ్' పేరుతో తోపుడు బండిపై ఏర్పాటు చేసిన ఈ టీ సెంటర్లో మనం రోజు తాగే అన్నీ టీలు ఇక్కడ ఉంటాయి.
పుట్టగొడుగులను కొందరు మాంసాహారమని మరికొందరు శాఖాహారమని అంటున్నారు. అయితే ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ అనే దాని మీద పలువురు పలు రకాలుగా చెప్తున్నారు. పుట్టగొడుగుల కూర చూడగానే నోరూరినవారంతా కచ్చితంగా మాంసాహారులే అయ్యుంటారు. ఎందుకంటే శాకాహారులెవ్వరూ ఈ కూర తినేందుకు ఇష్టపడరు.