Last Updated:

Oppo India: రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిన ఒప్పో ఇండియా

రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ఒప్పో ఇండియా పై జూలై 8న షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఒప్పో ఇండియా ఒక చైనీస్ సంస్థ యొక్క భారతీయ అనుబంధ సంస్థ, Oppo, OnePlus మరియు Realmeతో సహా వివిధ బ్రాండ్ల మొబైల్ ఫోన్లను డీల్ చేస్తుంది.

Oppo India: రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిన ఒప్పో ఇండియా

New Delhi: రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ఒప్పో ఇండియా పై జూలై 8న షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఒప్పో ఇండియా ఒక చైనీస్ సంస్థ యొక్క భారతీయ అనుబంధ సంస్థ, Oppo, OnePlus మరియు Realmeతో సహా వివిధ బ్రాండ్ల మొబైల్ ఫోన్లను డీల్ చేస్తుంది.

విచారణ సమయంలో, ఒప్పో ఇండియా కార్యాలయ ప్రాంగణంలో మరియు దాని కీలక నిర్వహణ ఉద్యోగుల నివాసాలలో డిఆర్ఐ సోదాలు నిర్వహించింది. మొబైల్ ఫోన్లు తయారీ కోసం ఒప్పో ఇండియా దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరణలో ఉద్దేశపూర్వక తప్పుగా ప్రకటించడాన్ని సూచించే నేరారోపణ సాక్ష్యాలను రికవరీ చేసినట్లు ,ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తప్పుడు ప్రకటన ఫలితంగా ఒప్పో ఇండియా రూ. 2,981 కోట్ల సుంకం మినహాయింపు ప్రయోజనాలను తప్పుగా పొందింది” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది.

ఇవి కూడా చదవండి: