Last Updated:

Independence Day 2022: అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, మార్చురీ వర్కర్లు.. ఎర్రకోట స్వాతంత్య్రదినోత్సవ వేడుకులకు విశిష్ట అతిధులు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న వేడుకలు ప్రత్యేకించి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎర్రకోటలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, మార్చురీ వర్కర్లు, ముద్రా పథకం రుణగ్రహీతలు పాల్గొన్నారు.

Independence Day 2022: అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, మార్చురీ వర్కర్లు.. ఎర్రకోట స్వాతంత్య్రదినోత్సవ వేడుకులకు విశిష్ట అతిధులు

New Delhi: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న వేడుకలు ప్రత్యేకించి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎర్రకోటలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, మార్చురీ వర్కర్లు, ముద్రా పథకం రుణగ్రహీతలు పాల్గొన్నారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబడిన వారిలో స్వచ్ఛాగ్రహ, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆటో-రిక్షా డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మరోవైపు భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారత నౌకాదళ యుద్ధనౌకలు ఆరు ఖండాలు, మూడు మహాసముద్రాలు మరియు ఆరు వేర్వేరు సమయ మండలాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: