Home / తెలంగాణ
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పౌరసరఫరాల శాఖ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 13లక్షల గోనె సంచులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవ శాత్తు జరిగిన ఈ ఘటనలో గోదాములో భారీ యెత్తున మంటలు ఎగిసిబడ్డాయి.
మునుగోడు ఉపఎన్నికలు రోజురోజుకు కాక పుట్టిస్తున్నాయి. బైపోల్స్ దగ్గర పడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఇంటిఇంటికి తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.
రాజకీయాలు రాజకీయాలే. ప్రభుత్వం ప్రభుత్వమే. ఇది మరిస్తే ఎవరికైనా పరాభవం తప్పదు. వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నారని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ సీఎం కేసిఆర్ రాజ్యాంగ బద్ధ వ్యవస్ధలను అగౌరపరుస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యుకుడిని చంపి శవాన్ని కల్చేశారు గుర్తు తెలియని కొందరు దుండగులు.
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజరవర్గంలో జరిగే ఉప ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డిపై చెప్పుతో దాడికి ప్రయత్నించారు.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలకు సర్వం సిద్దం చేసిన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ మీడియాతో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేర నాకా బంద్ (చెక్ పోస్టు)లో ఇప్పటివరకు రూ. 1,48,44,160 స్వాధీనం చేసుకొన్నామన్నారు.
అధికార బలం, తాయిలాలు, హామీలు మాటున మునుగోడు ఉప ఎన్నికల్లో పలు పార్టీలు పోటా పోటీలు పడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు, ములుగు శాసనసభ్యురాలు ధనసారి అనసూయ (సీతక్క) మాత్రం తనదైన శైలిలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
అవినీతికి కేరాఫ్ అడ్రసుగా నిలిచారంటూ సీఎం కేసిఆర్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్ష్యురాలు వైఎస్ షర్మిల మరో మారు ఆయన పాలనపై మండిపడ్డారు. 8ఏళ్లుగా కేసిఆర్ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారని ఆయన అన్నారు.
విహార యాత్ర అతనిపాలిట మృత్యువుగా మారింది. స్నేహితులతో సరదా కాస్తా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకొనింది.