Home / తెలంగాణ
హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే రెండో జాబితాల్లో 63 మంది సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. మొదటి జాబితాలో 20 మంది.. రెండో జాబితాలో 43 మంది అభ్యర్ధులను ప్రకటించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఉదయం నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని వచ్చారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ది కీలక పాత్రని అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ బతకదని తెలిసినా తాము రాష్ట్రాన్ని ప్రకటించామని తెలిపారు. శుక్రవారం బషీర్బాగ్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం నీకు తెలియదు మా బలాన్ని గుర్తించి మీ నానమ్మ ఇందిరాగాంధీ దారుసలాంకు వచ్చిందన్నారు. ఈ గడ్డం టోపీదారులే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం.. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇలా నాలుగు అంశాల్లో చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నికల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. పోటీకి దూరంగా ఉండాలని తనను కాంగ్రెస్ నేతలు కోరారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేటినుంచి అభ్యర్థులు ఖర్చులను ఎన్నికల కమీషన్ లెక్క గట్టనుంది. అందుకే నోటిఫికేషన్ కు ముందే పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి నెల రోజుల్లోపు ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.
తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమైన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. గత వారం రోజులుగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు నిర్వహించిన రామచంద్ర యాదవ్ గురువారం 20 మందితో తొలి జాబితాను విడుదల చేశారు.
మహబూబ్నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.