Home / Adilabad
Insects in food: అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు వచ్చిన ఘటన చోటు చేసుకుంది. అంతే కాదు రోజూ నీళ్ల పప్పు పెడుతున్నారని.. అన్నం సుద్ద సుద్దగా ఉంటున్న విషయాన్ని ఓ విద్యార్థి గమనించి హాస్టల్ ఇన్చార్జిని ప్రశ్నించాడు. అయితే ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన అధికారి పట్టించుకోక పోగా సదరు ప్రశ్నించిన విద్యార్థికి టీసీ ఇస్తానని బెదిరించారు. ఇలా విద్యార్థిని బెదిరించిన హాస్టల్ […]
2 Killed in Adilabad Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం […]
Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం నుంచి రక్షణ కోసం పొలంలో ఉన్న కర్రలతో […]
kaleshwaram: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నదిలో నేటి నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు మొదలవుతాయని పండితులు తెలిపారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత […]
Poisoning Attempt in Adilabad government school drinking water: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది. ఇచ్చోడలోని ధర్మపురి ప్రభుత్వ పాఠశాల వంట రూంలోని నీటిలో పురుగుల మందు కలిపినట్లు తేలింది. దీంతో పాటు విద్యార్థులు వినియోగించే నీటిలోనూ పురుగుల మందు చల్లారు. ఇలా విష ప్రయోగం చేసిన తర్వాత ఆ పురుగుల మందు డబ్బాను అక్కడే పాడేయడం గమనార్హం. అయితే, పాఠశాల తెరిచిన తర్వాత టీచర్లు ముందే గుర్తించడంతో […]