Home / తాజా వార్తలు
ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలిందని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్కుమార్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామన్ వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. బర్మింగ్హామ్లో మెడల్స్ సాధించిన వారితో తాను భేటీ అవుతానని గతంలోనే ప్రధాని ప్రకటించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఎంట్రన్స్లను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG)తో విలీనం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ ) దీనికి సంబంధించినిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది.
కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు.
కుల వివాదం కేసులో ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు కుల పరిశీలన కమిటీ శనివారం క్లీన్ చిట్ ఇచ్చింది. వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని ఆ ఉత్తర్వు చెబుతోంది.అతను మరియు అతని తండ్రి ఇస్లాంలోకి మారినట్లు ఇంకా రుజువు కాలేదని, అయితే, వారు హిందూ మహర్ 37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని రుజువైంది.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం రెండోసారి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.ట్విట్టర్లో, పార్టీ ఎంపీ మరియు కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, "ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం సోనియా ఐసోలేషన్లో వున్నారని రాసారు.
అమెరికాలోని న్యూయార్క్లో శుక్రవారం జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో రచయిత సల్మాన్ రష్దీ మెడ, పొత్తికడుపుపై ఒక వ్యక్తి కత్తితో దాడిచేసారు. 75 ఏళ్ల రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారు .అతను ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అతనిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
అడిస్ అబాబా నుండి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానంలో చెన్నై వచ్చిన ఒక ప్రయాణీకుడినుంచి రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అధికారులు ఇక్బాల్ బి ఉరందాడి అనేప్రయాణికుడిని అడ్డగించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్లో వివరించారు.