Home / తాజా వార్తలు
ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టుతో క్వార్టర్స్లో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ జన్మదిన వేడుకల కోసం సిద్ధం చేసిన కేక్ ఆలయం నమూనాలో ఉండటం, దానిపై హనుమంతుడి చిత్రం ఉండటంపై వివాదం చెలరేగింది.
లవ్ టుడే సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది దిల్ రాజు టీమ్. ఈ ట్రైలర్ విడుదలతోనే మంచి సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలిస్తోంది.
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత బోండా ఉమపై ట్విట్టర్లో సెటైర్లు వేసారు. రెండేళ్ల నుంచి 2000 రూపాయలనోట్లు ముద్రించనపుడు ఎలా కనపడతాయంటూ ప్రశ్నించారు. బహుశా చంద్రబాబు ఇంట్లోనే చూసి ఉంటాడంటూ చమత్కరించారు.
ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పిట్టకధల మంత్రి అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారని సమాచారం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ నెట్టింట గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా తమన్నా ఆస్తి కోసమే వివాహం చేసుకుంటుందని అతడు ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడం వల్లే పెళ్లికి అంగీకరించిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కాగా వీటన్నింటికి చెక్ పెడుతూ తమన్నా తను పెళ్లి చేసుకునేది ఇతనేనంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ఓ ప్రయివేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తన ఆస్తిపాస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలనేది ఓ వీలునామా రాశారట. ప్రస్తుతం ఆ వీలునామా టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.