Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి సాయంత్రం వరకు డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ప్రజా స్రవంతిలో ధరలు కట్టడి అనేది ఏ ప్రభుత్వానికైనా ఎంతో ముఖ్యం. దానిపై పాలక ప్రతిపక్షాల మద్య నిత్యం మాటలు యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాని నేడు ఆదిశగా ప్రభుత్వాల అడుగులు పడడం లేదు. కేవలం ప్రతిపక్షానికి మేము ఏం జవాబు చెప్పేది అన్న కోణంలో సాగుతున్నట్లుగా శాసనసభా సమావేశాల తీరు ఉందని ఏపి అసెంబ్లీ సమావేశాలు రుజువుచేస్తున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నెలలో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. విజయవాడలో జరగనున్నసిపీఎం జాతీయ మహాసభలో ఆయన పాల్గొననున్నారు
నిత్యం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యులు సైతం కలియుగ దైవాన్ని సందర్శించుకొని మరీ మొక్కులు చెల్లించుకొంటారు ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేశ్వర స్వామివారిని విఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొన్నారు.
అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలంటే వందేళ్లైన పూర్తికాదని, కేవలం కలలో మాత్రమే ఊహించుకోవచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేసారు. అసెంబ్లీలో జగన్ పాలన వికేంద్రీకరణపై ప్రసంగించారు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.
ఏపీ రాజధాని పనులు 40శాతం పూర్తి అయ్యాయని, అసెంబ్లీ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతమే రాజధానిగా చూడాలని, ప్రస్తుత ఏపీ రాజధాని సంక్షోభానికి ముఖ్యమంత్రి జగన్ కారణమని కేంద్ర మంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అందరూ ఊహించిన్నట్లుగానే ఏపి అసెంబ్లీ నుండి తెలుగుదేశం సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేవాలు గురువారం ప్రారంభమైన నేపధ్యంలో సభా నిర్వహణ పైన స్పీకర్ తమ్మినేని సీతారాం బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ (బీఏసీ) ఏర్పాటు చేసారు. ప్రభుత్వం నుంచి సీఎం జగన్ తో సహా శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన, బీఏసీలో సభ్యులుగా ఉన్న మంత్రులు హాజరయ్యారు.