Mahesh Babu: మహేశ్ బాబు ఇంట్లో చోరీకి విఫలయత్నం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట ఒకే ఏడాదిలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్దినెలల క్రితం అన్నయ్య రమేష్ బాబు మరణించగా, 28 సెప్టెంబర్ 2022 బుధవారం ఉదయం తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట ఒకే ఏడాదిలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్దినెలల క్రితం అన్నయ్య రమేష్ బాబు మరణించగా, 28 సెప్టెంబర్ 2022 బుధవారం ఉదయం తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.

మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం రోజు తుదిశ్వాస విడిచారు. దీనితో మహేశ్ ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
మహేష్ కుటుంబ సభ్యులంతా నిన్న ఇందిరా దేవి ఇంట్లోనే ఉన్నారు. అయితే ముందురోజు రాత్రి అనగా మంగళవారం అర్ధరాత్రి ఓ దుండగుడు మహేష్ ఇంట్లో దొంగతనానికి యత్నించాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లో ఉన్న మహేశ్ బాబు ఇంట్లో దొంగతనం చేయాలని ఓ వ్యక్తి భావించాడు. దీనికి గాను మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో మహేశ్ ఇంటి ప్రహరీ గోడ ఎక్కి లోపలి దూకాడు.
ఆ గోడ చాలా ఎత్తుగా ఉండడంతో దాన్ని దూకిన దొంగ కిందపడిన గాయపడ్డాడు. శబ్దం రావడంతో మహేష్ ఇంటి సెక్యూరిటీ  అక్కడికి వెళ్లి చూడగా గాయాలతో పడిఉన్న దొంగ కనిపించాడు. దీనితో వెంటనే పోలీసులకి సమాచారం అందించి దొంగని పోలీసులకి అప్పగించారు.

కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపగా అతడి పేరు కృష్ణ (30) అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు దొంగ చెప్పాడు. మహేష్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. గాయపడిన దొంగను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే దొంగతనానికి యత్నంచిన సమయంలో మహేశ్ తన ఇంట్లో లేరని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత