Home /Author Guruvendhar Reddy
AP CM Chandrababu to Visit Polavaram Project Today: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది రెండవ సారి సీఎం పోలవరాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్ను తేదీలతో సహా వివరించనున్నారు. రెండవ పర్యటన ఆంధ్రప్రదేశ్ […]
Deputy CM Bhatti Vikramarka Announced 12 thousand for landless poor: భూమిలేని పేద కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఈ నెల 28 నుంచి రూ.12 వేల మొత్తాన్ని అందించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా.. సంక్రాంతి నుంచి రైతుభరోసా డబ్బులు అందజేస్తామని డిప్యూటీ […]
Congress inconsistent on issue of EVMs, says Omar Abdullah: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షం నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆదివారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటూ, ఓడితే ఈవీఎంలను నిందిస్తే జనం ఆమోదించరని వ్యాఖ్యానించారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదేం […]
Central Government Reverse decision to One Nation One Election Bills: ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో అటు లోక్సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉబలాటపడిన ప్రధాని నరేంద్రమోదీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించటంతో ఈసారి ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకురాకపోవచ్చని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల 16న లోక్సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం […]
India vs Australia 3rd Test: గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడవ టెస్ట్లో ఆసీస్.. భారీ స్కోరు సాధించింది. శనివారం వర్షం కారణంగా 13.1 ఓవర్లకే ఆట ఆగిపోగా, ఆదివారం ఉదయం మళ్లీ మొదలైంది. మొదటి సెషన్ ఆరంభంలో ఆసీస్ కీలక వికెట్లు పడినా… ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్లు భారత బౌలర్లను ఓ ఆట అడుకున్నారు. నిలకడగా ఆడుతూ, బంతులను బౌండరీలకు తరలించారు. ఈ […]
Parliament Attack December 13, 2001: భారత ప్రజాస్వామ్యపు కోవెలగా చెప్పే పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకొని 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు చేసిన దాడితో జాతి నివ్వెరబోయింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్ గల ఓ అంబాసిడర్ కారు ఆ రోజు ఉదయం 11 వేళ పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. అందులోని ఐదుగురు ఉగ్రవాదులు అరగంట పాటు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై వారిని మట్టుబెట్టటం జరిగింది. […]
KTR Fires on CM revanth Over Lagacharla Farmer Incident: లగచర్ల విషయంలో రేవంత్రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి, రైతులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నందినగర్లోని తన నివాసంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ ఈగోకు పోవటంతో గిరిజన రైతుల ప్రాణాల మీదకొచ్చిందన్నారు. కుటుంబ సభ్యులకూ చెప్పరా..? సంగరెడ్డి జైల్లో ఉన్న హీర్యానాయక్కు గుండెపోటు వస్తే కుటుంబ […]
Central Cabinet Approves Jamili Elections Bill: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జమిలి ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]
Massive encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం […]