Gang Rape: జహీరాబాద్లో వివాహితపై గ్యాంగ్ రేప్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. వివాహితపై సామూహిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Gang Rape: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. వివాహితపై సామూహిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఉదయం జహీరాబాద్-డిడిగి శివారులో మత్తులో ఉండి, అచేతన స్థితిలో పడిఉన్న ఓ మహిళను అటుగా వెళ్తున్న ఓ స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్ పోలీస్ స్టేషన్​కు తీసుకుని వెళ్లి అప్పగించారు. 24 ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం రాత్రి హౌసింగ్ బోర్డ్ ఏరియా నుంచి తీసుకొచ్చి సంగారెడ్డి జహీరాబాద్​ శివారు ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడి వదిలివెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు సికింద్రాబాద్​లోని తిరుమలగిరి లాల్ బజార్ ప్రాంతానికి చెందిన మహిళగా విచారణలో తేలింది. వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్తతో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. బాధితురాలను జహీరాబాద్ పోలీసులు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. కాగా సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు మరియు ఈ ఘటనపై మాట్లాడేందుకు జహీరాబాద్ డీఎస్పీ రఘు నిరాకరించడం వంటి అంశాలు ఈ కేసుపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

ఇదీ చదవండి: Crime News: బాత్రూంలో బట్టలు మార్చుకుంటున్న వీడియో తీసి..!