Minister Satyakumar Satires on KTR: కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైర్లు

తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది

  • Written By:
  • Updated On - July 10, 2024 / 07:23 PM IST

Minister Satyakumar Satires on KTR: తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది. తాజాగా ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.

ధరణి పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ నడిపిన భూ మాఫియా మాదిరే.. ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించారని, చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడని ఏపీ మంత్రి సత్యకుమార్ చెప్పుకొచ్చారు .అంతేకాదు గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా… కలెక్షన్… కరప్షన్… కమీషన్లే! అంటూ .. కేటీఆర్ పై సెటైర్లు విసిరారు.

ఒకే జాతి పక్షులు..(Minister Satyakumar Satires on KTR)

గతంలో బీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు నాలుగు సంవత్సరాల క్రితం సత్యకుమార్ ని ఎక్స్ లో బ్లాక్ చేశారని … ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయని కేటీఆర్ కి గట్టిగానే చురకలు అంటించారు. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికెట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి” అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.దీంతో ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైర్లు ,మాటల దాడికి తట్టుకోలేక ..ఆయన్ని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌‌ను బ్లాక్ చేయడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.