Site icon Prime9

రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టు లో రేవంత్ రెడ్డి పిటిషన్.. కోర్టు ఏం చెప్పింది?

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కూలీ పేరుతో టీఆర్‌ఎస్ నేతలు పార్టీకి నిధులు వసూలు చేశారని రేవంత్ రెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐటీ శాఖకు సంబంధించిన విచారణ పెండింగ్ లో ఉంది. ఈ పరిశీలన పూర్తి కాకుండా బీఆర్ఎస్ గా పేరు మార్చడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డిసెంబర్ 6వ తేదీ లోపు బీఆర్ఎస్ విషయంలో అభ్యంతరం ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ఈసీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సంఘం ప్రకటన మేరకు రేవంత్ రెడ్డి అభ్యంతరాలు నమోదు చేశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి అభ్యంతరం పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం బీఆర్ఎస్ కు లేఖ ఇచ్చింది. ఈ విషయంపైన ఢిల్లీ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ కేసు వాదనలు ఈ రోజు జరిగాయి.దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. అభ్యంతరాలు ఉన్న శాఖలపై ప్రత్యేక పిటిషన్‌లు వేసుకోవాలని సూచించింది. మరో పిటిషన్ వేసుకునేందుకు రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించింది.

Exit mobile version
Skip to toolbar